Ambati Rambabu : పవన్ కల్యాణే ..నా అల్లుడ్ని రెచ్చగొట్టింది – అంబటి రాంబాబు
తన అల్లుడు ఇలా మాట్లాడడం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడని అంబటి రాంబాబు ఆరోపించారు
- By Sudheer Published Date - 08:13 PM, Sun - 5 May 24
మరో వారం రోజుల్లో ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగనున్న క్రమంలో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) కు భారీ షాక్ ఇచ్చాడు ఆయన అల్లుడు. ఈసారి ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అంబటి రాంబాబుకు ఓటు వేయొద్దని సొంత అల్లుడు గౌతమ్ ఓటర్లకు సూచించారు. అంబటి రాంబాబు లాంటి నీచుడు, శవాలమీద పేలాలు ఏరుకునే రకం. సమాజం మీద బాధ్యతలేని వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దు. ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఓటు వేయాలి అని ఓటర్లను కోరారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియో ను కూటమి పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తూ..ఇలాంటి వారికా ఓట్లు వేసిందంటూ ప్రజలను ప్రశ్నిస్తున్నారు. ఉదయం నుండి సత్తెనపల్లి నియోజకవర్గం మాత్రమే కాదు రాష్ట్రం మొత్తం కూడా రాంబాబు గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది పార్టీ కి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రహించిన వైసీపీ అధిష్టానం అలర్ట్ అయ్యింది. ఏకంగా దీనిపై అంబటి నే ప్రెస్ మీట్ పెట్టెల చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రెస్ మీట్ లో అంబటి రాంబాబు మాట్లాడుతూ…తన కూతురు ..అల్లుడు విడాకులు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని..గత కొద్దీ ఏళ్లుగా వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారని..కూతుర్ని , పిల్లలను తానే చేసుకుంటున్నట్లు తెలిపారు. తన అల్లుడు ఇలా మాట్లాడడం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడని అంబటి రాంబాబు ఆరోపించారు. పవన్ కల్యాణే అతడితో మాట్లాడించాడు, చంద్రబాబు అందుకు సపోర్ట్ చేస్తున్నాడని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇది దుర్మార్గం కాదా? ఒక కుటుంబ విషయాన్ని ఇంత తీవ్రస్థాయిలో రచ్చకీడ్చి రాజకీయ లబ్ధి పొందడాన్ని ఏమనాలి? అని ప్రశ్నించారు. నేను సత్తెనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నన్ను ఓడించాలనుకుంటున్న పవన్ కల్యాణ్, నన్ను అసెంబ్లీకి రానివ్వకూడదనుకుంటున్న చంద్రబాబు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం అంటూ రాంబాబు చెప్పుకొచ్చాడు.
Read Also : AP DGP Transfer: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీ బదిలీ
Related News
YS Sharmila : పోలింగ్ ముగిసిన తర్వాత షర్మిల ఎందుకు అమెరికా వెళ్లింది..?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల తమ తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి (వైఎస్ఆర్) వారసత్వం అంటూ ఇప్పుడు ఒకరిపై ఒకరు సంకల్ప యుద్ధం చేస్తున్నారు.