HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Allu Arjun Gets Big Relief In Ap High Court Quash Petition Accepted

Allu Arjun Quash Petition: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్!

సినీ నటుడు అల్లు అర్జున్ మరియు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఊరట తీర్పును ప్రకటించింది.

  • By Kode Mohan Sai Published Date - 02:37 PM, Wed - 6 November 24
  • daily-hunt
Ap High Court Big Relief To Allu Arjun
Ap High Court Big Relief To Allu Arjun

AP High Court Big Relief To Allu Arjun: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు ఊరట దక్కింది. నంద్యాల పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో, నంద్యాల వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి అల్లు అర్జున్‌ వెళ్లారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వాహనాలు, మోటారు సైకిళ్లతో ఆయనను పట్టణ శివారు నుంచి భారీ ర్యాలీతో నంద్యాలలోకి తీసుకెళ్లారు. ఈ పర్యటనకు అధికారిక అనుమతులు లేవు, కానీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ విషయాన్ని కొంతమంది ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో, సెక్షన్ 144 మరియు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా, అనుమతులు లేకుండా జనసమీకరణ నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, నంద్యాల టూ టౌన్ పోలీసులు అల్లు అర్జున్ మరియు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా హైకోర్టు ఈ కేసును క్వాష్ చేస్తూ అల్లు అర్జున్‌కు ఊరటను ఇచ్చింది.

ఈ కేసును క్వాష్ చేయాలని అల్లు అర్జున్ మరియు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ గత నెల 25న విచారణకు వచ్చినప్పటికీ, ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ కేసుపై హైకోర్టు ఇవాళ (నవంబర్ 6) తుది తీర్పును ఇవ్వాలని ప్రకటించింది. అనంతరం, అల్లు అర్జున్‌పై నమోదైన కేసును క్వాష్ చేస్తూ హైకోర్టు తీర్పును వెల్లడించింది.

ఎన్నికల సమయంలో శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఒక వైపు, పవన్ కళ్యాణ్ సమీప బంధువుగా ఉన్న అల్లు అర్జున్, ఆయనకు మద్దతు తెలపకుండా, ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీకి చెందిన శిల్పా రవికి ప్రచారం చేయడం తప్పు అని జనసేన వర్గం ప్రశ్నించింది.

జనసేన శ్రేణులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు అప్పట్లో సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు, అవమానాలు చేశాయి. అందుకు తోడు, మెగా, అల్లు అభిమానులు కూడా సోషల్ మీడియాలో మాటల యుద్ధాన్ని మొదలుపెట్టారు. అయితే, ఈ వివాదంపై అల్లు అర్జున్ సమాధానం ఇచ్చారు. “రవి నా మిత్రుడు, నా మనసుకు నచ్చిన వ్యక్తుల కోసం నేను ఎక్కడైనా వెళ్లగలుగుతాను” అని ఆయన స్పష్టంగా చెప్పారు.

వాస్తవానికి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి భార్య నాగిని రెడ్డి మరియు అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి చదువుకున్నారు, అందుకే స్నేహా రెడ్డి ద్వారా శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మరియు అల్లు అర్జున్ మంచి స్నేహితులు అయ్యారు. వారి అభిరుచులు దగ్గరగా ఉండటం వలన వీళ్ల మధ్య స్నేహం మరింత బలపడింది.

2019 ఎన్నికల్లో కూడా, శిల్పా రవికి అల్లు అర్జున్ తన మద్దతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఈసారి శిల్పా రవి తక్కువ ఓట్లతో ఓడిపోయారు.

మరోవైపు, అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని, అనంతరం రంగనాయకుల మండపంలో పురోహితుల నుంచి వేద ఆశీర్వచనం పొందారు. శ్రీవారి తీర్థప్రసాదాలు ఇచ్చి, పట్టువస్త్రంతో సత్కరించారు.

Allu Sneha Reddy Visits Tirumala

Allu Sneha Reddy Visits Tirumala

ఈ సందర్భంగా, అల్లు అర్జున్ ప్రస్తుతం తన సినిమా “పుష్ప 2” ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు, అందుకే ఆయన స్వయంగా తిరుమలకు రాలేదు. అయితే, స్నేహా రెడ్డి తన స్నేహితులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప 2: ది రూల్” సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబరు 5న పాన్-ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉంది.

#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/SZMNKWJKMJ

— Allu Arjun (@alluarjun) October 24, 2024


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Allu Arjun Quash Petition
  • AP high court

Related News

    Latest News

    • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

    • Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు

    • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

    • Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

    • Drinking Water: ‎నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd