HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >After Hospital Visit Ys Jagan Fires On Chandrababu

Jagan Atchutapuram : అచ్యుతాపురం బాధితులకు అన్యాయం చేస్తే ధర్నా చేస్తా – జగన్ హెచ్చరిక

అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని సీఎం జగన్ పేర్కొన్నారు

  • By Sudheer Published Date - 03:14 PM, Fri - 23 August 24
  • daily-hunt
Jagan Atchutapuram
Jagan Atchutapuram

బుధువారం అనకాపల్లిలోని అచ్యుతాపురం (Atchutapuram ) ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన (Reactor Explosion) ఘటన తెలిసిందే. ఈ ఘటన లో దాదాపు 16 మందికి పైగా చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన ఫై ప్రధాని మోడీ దిగ్భ్రాంతం వ్యక్తం చేయగా..మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి పరిహారం అందించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.25 లక్షల చొప్పున అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి.. అనకాపల్లిలోని (Anakapalli) ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న బాధితులను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఆస్పత్రిలో వారికి అందుతున్న వైద్య సేవలపై జగన్ ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామని.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కాగా అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని సీఎం జగన్ పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బాధిత కుటుంబాల‌కు పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే బాధితుల పక్షాన వైసీపీ పోరాడుతుంద‌ని చెప్పారు. వారి కోసం తానే స్వయంగా నేనే ధర్నాకు వస్తాన‌ని జగన్ హెచ్చరించారు. కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర ప్రమాదం వివరాలు లేవన్నారని చెప్పుకొచ్చారు. ఎంత మంది చనిపోయారో తెలియదన్నారు. ఘటనా స్థలానికి ఆంబులెన్సులు కూడా రాని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. బాధితుల్ని కంపెనీ బస్సుల్లో తీసుకొచ్చారని జగన్ వివరించారు. తమ హయాంలో ఇలాంటి ఘటనే జరిగిందని గుర్తు చేసుకున్నారు. కోవిడ్ సమయంలో ఎల్జీ పాలిమర్స్ లో ఘటన జరిగితే 24 గంటల్లో పరిహారం ఇప్పించామని జగన్ చెప్పుకొచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం తమ ప్రభుత్వంలా స్పందించలేదన్నారు. కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించిన తీరు బాధగా అనిపిస్తోందన్నారు. ఈ ఫ్యాక్టరీలో ప్రమాదంలో ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసారు. పరిహారం అనేది సానుభూతితో ఇవ్వాలన్నారు. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలని సూచించారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తే ఈ ఘటన గురించి ఎక్కువ స్పందించకూడదు అనే తాపత్రయం కనపడింది

17 మంది చనిపోతే సాయంత్రం 4 గంటలకు హోం మంత్రి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా సహాయచర్యలను పర్యవేక్షించడానికి అనకాపల్లి వెళ్తున్న అనేమాట… pic.twitter.com/eDoLJ7cNev

— YSR Congress Party (@YSRCParty) August 23, 2024

Read Also : Rain : హైదరాబాద్ లో విచిత్రం..రెండు ఇళ్ల మద్యే వర్షం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Atchutapuram Incident
  • YS Jagan Fires on Chandrababu

Related News

Lokesh Meets Amith

Storm Damage : తుఫాను నష్టంపై అమిత్ షాకు లోకేష్ నివేదిక అందజేత

Storm Damage : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా తుఫాను సృష్టించిన బీభత్సం, దాని వల్ల జరిగిన నష్టంపై రాష్ట్ర మంత్రులు లోకేశ్ మరియు హోంమంత్రి అనిత కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదిక సమర్పించారు

  • World AIDS Day

    AIDS Day : ఎయిడ్స్ కేసుల్లో టాప్ లో ఏపీ

  • Sir Mp Lavu Krishnadevaraya

    SIR : ఏపీలోనూ SIR చేపట్టాలి – ఎంపీ లావు

  • New Rule In Anna Canteen

    Anna Canteens : అన్న క్యాంటీన్లకు కమిటీలు

  • Cyclone Ditwah

    Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

Latest News

  • Powerful Officers: ప్రధానికి అత్యంత సన్నిహితులు ఈ అధికారులే.. మొత్తం వ్యవస్థపై పట్టు వీరిదే!!

  • Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌.. రెండు ఫుట్‌బాల్ అకాడమీలు ప్ర‌క‌టించే ఛాన్స్‌?!

  • IND vs SA T20 Series: సౌతాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌.. భార‌త్ జ‌ట్టును ఎప్పుడు ప్ర‌క‌టిస్తారు?!

  • Potatoes: మీరు కూడా ఆలుగ‌డ్డ‌ల‌ను ఇలా చేస్తున్నారా?

  • Ekadashi Dates 2026 : 2026 లో ఏకాదశి వచ్చే తేదీలు ఇవే!

Trending News

    • Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

    • Glenn Maxwell: ఐపీఎల్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం.. లీగ్‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?!

    • AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

    • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd