Chandrababu : చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల ఫై తీర్పు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
ఈరోజు మరోసారి చంద్రబాబు, సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు… తీర్పును రిజర్వ్ చేసింది
- By Sudheer Published Date - 02:46 PM, Fri - 6 October 23
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల (Chandrababu Bail and Custody Petition) ఫై మరోసారి ఏసీబీ కోర్ట్ (ACB Court ) తీర్పు వాయిదా వేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయినా టీడీపీ అధినేత ,మాజీ సీఎం చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్ల గత కొద్దీ రోజులుగా వాదనలు నడుస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు వాదనలు పెరుగుతున్నాయి.. తప్ప బెయిల్ ఫై కానీ కస్టడీ పిటిషన్ల ఫై కానీ ఎలాంటి తీర్పు రావడం లేదు. రోజు రోజుకు తీర్పును వాయిదా వేస్తూ వెళ్తుంది ఏసీబీ కోర్ట్.
We’re now on WhatsApp. Click to Join.
చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతుండగా… బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరుతూ వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. దీనిపై గురువారమే విచారణ జరగగా… ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. ఈరోజు మరోసారి చంద్రబాబు, సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు… తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం నాడు (9వ తేదీ) తీర్పును వెలువరిస్తామని జడ్జి ప్రకటించారు. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు కూడా సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఏసీబీ కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది.
ఈరోజు వాదనల్లో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని, ఆయన బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకోవాలని పొన్నవోలు సుధాకర్ కోరారు. ఇప్పటికే ఆదాయపన్ను వివరాలు కూడా తీసుకున్నామని, సీఐడీ అధికారులు విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. వాటిలో చంద్రబాబు పాత్ర, ఇతరులకు డబ్బు పంపిణీ అంశాలపై విచారణ చేయాలని అన్నారు. అందుకే ఐదు రోజుల కస్టడీ కోరుతున్నామని పొన్నవోలు అన్నారు. కస్టడీకి ఇవ్వాలన్న ఏఏజీ వాదనలపై చంద్రబాబు తరుపు న్యాయవాది దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. కస్టడీకి కోరడం పసలేని వాదనలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారని, విచారణలో చంద్రబాబు సహకరించారని కోర్టుకు వివరించారు. కస్టడీ ముగిసినా ఇప్పటివరకు కేసు డైరీ సమర్పించలేదని న్యాయవాది దూబే వాదించారు. దీంతో కేసు డైరీ ఎక్కడ ఉందని సీఐడీ అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించారు.
Read Also : Kushboo Support to Roja : మంత్రి రోజా కు సపోర్ట్ గా నిలిచిన సీనియర్ నటి
Related News
Chandrababu : అమెరికాలో చంద్రబాబు.. ఆయన అడ్రస్ కోసం వెతుకుతున్న తెలుగువారు
ఉక్కపోతలో ఎన్నికల ప్రచార షెడ్యూల్లలో పాల్గొని, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పూర్తి కావడంతో, అన్ని రాజకీయ నేతల నాయకులు తమ తీవ్రమైన షెడ్యూల్ల నుండి చాలా అవసరమైన విరామం తీసుకున్నారు.