Tragedy in AP : చలాకీ తనంతో సీఎం జగన్ దృష్టిని ఆకర్షించిన ఆ చిన్నారి ఇక లేదు…!!
ఆంధ్రప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి విన్నవారిందరిలో కంటకన్నీరు తెప్పిస్తోంది
- By hashtagu Published Date - 10:02 AM, Fri - 2 September 22
ఆంధ్రప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి విన్నవారిందరిలో కంటకన్నీరు తెప్పిస్తోంది. అసలు విషయం ఏంటంటే…సరిగ్గా నెల క్రితం ఓ చిన్నారి…ఏపీ సీఎం జగర్ పర్యటనలో చాలా చలాకీగా సందడి చేసింది. ఆ చిన్నారి నిన్న డెంగ్యూ జ్వరంతో మరణించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లూరి సీతారామారాజు జిల్లా చింతూరు మండలం కుయిగూరు గ్రామానికి చెందిన కారం సంధ్య 10 ఏళ్ల వయస్సుంటుంది. చింతూరులోని ఓ ప్రైవేటు స్కూల్లో 5వ తరగతి చదువుతోంది. జూలై 27 సీఎం జగన్ చింతూరు మండలం కుయిగూరు పర్యటనకు వచ్చారు. అక్కడ ఎంతో చలాకీ సందడి చేస్తూ సీఎం దృష్టిని ఆకర్షించింది. దీంతో సీఎం జగన్ ఆ చిన్నారిని దగ్గరికి పిలుచుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాంటి బాలికకు ఇప్పుడే నిండునూరెళ్లు నిండాయని స్థానికులు కంటతడిపెడుతున్నారు. చిన్నారి తండ్రి కల్లేరు మాజీ సర్పంచి.
ఆయన కుటుంబం కొయిగూరులో నివాసం ఉంంటుంది. 4 రోజుల క్రితం ఏసుబాబుకు డెంగ్యూ సోకింది. దీంతో భద్రాచలంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చిన్నారి సంధ్య తండ్రిని చూసుకుంటూ ఆయనతోనే ఉంది. ఏసుబాబుకు నయం కావడంతో సోమవారం ఇంటికి వెళ్లాడు. అదేరోజున చిన్నారి కూడా నలతగా ఉందని అక్కడే పరీక్షలు చేశారు వైద్యులు. మామూలు జ్వరమే అని చెప్పారు. బుధవారం ఆ చిన్నారి జ్వరంతో వణికిపోయింది. దీంతో చింతూరు ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేయగా డెంగీ గా తేలింది. భద్రాచలంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో తిరిగి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు పరిస్థితి మరింత విషమించింది. చిన్నారి సంధ్య గురువారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచింది. చిన్నారి మరణంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Related News
AIMIM Chief: ఏపీ రాజకీయాలపై ఒవైసీ జోస్యం.. జగన్ కు జైకొట్టిన ఎంఐఎం చీఫ్
AIMIM Chief: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగిస్తారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)తో చేతులు కలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు ప్రజలు గుణపాఠం చెబుతారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల ప్రచారం