Andhra Villages: దాహమో రామచంద్రా.. ఏపీలో 850 గ్రామాల్లో నీటికి కటకట
ఏపీలోని పలు గ్రామాలు నీటి కొరతతో అల్లాడుతున్నాయి.
- By Balu J Published Date - 12:39 PM, Mon - 21 August 23
ఏపీలోని పలు గ్రామాలు నీటి కొరతతో అల్లాడుతున్నాయి. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, మడకశిర మున్సిపాలిటీలతో సహా దాదాపు 850 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టు కార్మికులకు ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు, బకాయిల కోసం సమ్మెకు దిగారు. తమ పెండింగ్ బకాయిలపైనా, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టు కార్మికులు నిరసనలు చేస్తున్నారు.
అధికారులు తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద మరియు అనంతపురం, సత్యసాయి జిల్లాలలో రెండు వందల కిలోమీటర్లకు పైగా పైప్లైన్, నిర్వహణ పాయింట్ల వద్ద కార్మికులు పంపులను స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం. తుంగభద్ర, కృష్ణా నదీ జలాలు రిజర్వాయర్లో నిల్వ చేయబడిన తరువాత PABR ప్రాజెక్ట్ ద్వారా త్రాగునీరు సరఫరా చేయబడుతోంది. కార్మికుల ఆందోళనతో పలు చోట్లా నీటి సరఫరా నిలిచిపోయింది.
వారంతా తమకుజీతాలు పెంచాలని డిమాండ్ చేయడంతో ఆయా గ్రామాల్లో నీటి కొరత ఏర్పడింది. ఇక విశాఖ ఏజెన్సీ పరిధిలో ఉండే గిరిజనులు, ఆదివాసీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురిసినా నీటి కొరత ఏర్పడింది. గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు చేసేదేమీ లేక అడువుల్లో దొరికే చెలిమ నీళ్లనే తాగుతున్నారు.
Also Read: Fake Ghee: కల్తీ నెయ్యి తయారుచేస్తున్న కేటుగాళ్లు, ఒకరు అరెస్ట్
Related News
Harish Rao: చంద్రబాబుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
హరీష్ సంచలన కామెంట్స్ కు పాల్పడ్డారు. విభజనలో భాగంగా పదేళ్ల గడువు ముగిసినా హైదరాబాద్ను ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని హరీష్ చెప్పారు.