Amarnath Yatra : 84 మంది ఏపీ యాత్రికులు సేఫ్.. ఇదరు మిస్సింగ్..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన సుమారు 84 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు
- By Prasad Published Date - 03:38 PM, Sun - 10 July 22
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన సుమారు 84 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
మరో ఇద్దరు మహిళలు సమాచారం మాత్రం తెలియడం లేదని తెలిపారు. తొలుత ఐదుగురు యాత్రికులు గల్లంతయ్యారని, ఆ తర్వాత ముగ్గురిని గుర్తించి వారు క్షేమంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చాలా మంది యాత్రికులతో, వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారు .
ప్రభుత్వ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం రాజమహేంద్రవరం నుండి అమర్నాథ్కు వెళ్లిన 20 మంది సభ్యుల బృందంలో, కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే జాడ తెలియలేదు. స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదివారం రాజమహేంద్రవరంలో ఇద్దరు మహిళల బంధువులను పరామర్శించి పరిస్థితిని చర్చించారు.
గుంటూరుకు చెందిన 38 మంది బృందం, తాడేపల్లిగూడెంలో 17 మంది సభ్యుల బృందం, తిరుపతికి చెందిన ఆరుగురు సభ్యుల బృందం, విజయనగరం నుండి వచ్చిన మరో యాత్రికుడు కూడా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.కడప జిల్లాలోని రాజంపేటకు చెందిన కొంతమంది యాత్రికులు కూడా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం AP భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ను శ్రీనగర్కు పంపారు. రాష్ట్రంలోని యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి AP ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ 1902ను ప్రారంభించింది.
Related News
Amarnath Yatra: జూన్ 29 నుండి అమర్నాథ్ యాత్ర
Amarnath Yatra:అమర్నాథ్ వార్షిక యాత్ర(Annual Yatra of Amarnath)జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని శ్రీ అమర్నాథ్ తీర్థక్షేత్ర బోర్డు(Shri Amarnath Tirthakshetra Board)ప్రకటించింది. 52 రోజులపాటు సాగే యాత్రకు సంబంధించిన ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి మొదలవుతుందని బోర్డు వెల్లడించింది. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని 3,880 మీటర్ల ఎత్తులోని గుహలో ఏర్పడే మంచులింగాన్ని దర్శించేందుకు ప్రతియేట�