Close To The Moon: ఎవరెస్ట్ కాదండోయ్.. చంద్రుడికి దగ్గరగా ఉన్నది ఆ దేశమే?
మామూలుగా భూమి మీద నివసించే వారు చంద్రుడు అందరికీ సమాన దూరంలో ఉంటాడు అని చెబుతూ ఉంటాడు. కానీ చంద్రుడు నుంచి ఏ దేశం ఎంత దూరంలో ఉంది అన్న విష
- By Nakshatra Published Date - 05:55 PM, Fri - 21 July 23
మామూలుగా భూమి మీద నివసించే వారు చంద్రుడు అందరికీ సమాన దూరంలో ఉంటాడు అని చెబుతూ ఉంటాడు. కానీ చంద్రుడు నుంచి ఏ దేశం ఎంత దూరంలో ఉంది అన్న విషయాన్ని మాత్రం శాస్త్రవేత్తలు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే అది భూమి మీద ఉన్నట్టు కిలోమీటర్లలో కొలిస్తే తెలిసేది కాదు. అందుకే చంద్రుడికి ఏ దేశం దగ్గరగా ఉంద. ఏ దేశం దూరంగా ఉందనేది సైంటిస్టులే చెబుతారు. అలా చంద్రుడికి దగ్గరగా ఉన్న దేశం ఏది అన్న వివరాల్లోకి వెళితే… చందమామ పైకి ఇస్రో తాజా ప్రయోగం నేపథ్యంలో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భూమ్మీద ఏ ప్రాంతం చంద్రుడికి దగ్గరగా ఉంటుందనే ప్రశ్నకు.. ఎవరెస్ట్ శిఖరమే అయి ఉంటుందని చాలా మంది అంచనా వేస్తుంటారు. ఎందుకంటే భూమిపై ఎత్తయిన ప్రాంతం అదే కాబట్టి. కానీ అది కొంత వరకే నిజం హిమాలయ పర్వతాలు, ఎవరెస్ట్ శిఖరం భూమి ఉపరితలంపైన మాత్రమే ఎత్తయినవి. భూమి మధ్యభాగం నుంచి చూస్తే ఎవరెస్ట్ కన్నా ఎత్తయిన ప్రాంతాలు ఉన్నాయి మరి. అవే చందమామకు, స్పేస్కు దగ్గరగా ఉంటాయి. చంద్రుడికి దగ్గరగా ఉన్న ప్రాంతం ఏదన్న దానిపై అమెరికాకు చెందిన జోసెఫ్ సెన్నె అనే ఇంజనీర్, న్యూయార్క్లోని హెడెన్ ప్లానెటోరియం డైరెక్టర్ నీల్ డెగ్రాస్ టైసన్ కలసి అధ్యయనం చేశారు. వారు పరిశీలన చేసిన తర్వాత ఆండీస్ పర్వత శ్రేణుల్లో ఈక్వెడార్ దేశం పరిధిలోకి వచ్చే మౌంట్ చింబోరాజో శిఖరం చంద్రుడికి దగ్గరగా ఉంటుందని పరిశీలనలో వెల్లడయింది.
దక్షిణ అమెరికా ఖండంలో సుమారు ఏడు దేశాల్లో ఆండీస్ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. అందులో భూమధ్యరేఖకు కాస్త దిగువన ఉన్న ఈక్వెడార్ పరిధిలో మౌంట్ చింబోరాజో శిఖరం ఉంది. ఎవరెస్ట్ ఎత్తు సముద్ర మట్టం నుంచి 8,848 మీటర్లు, అదే చింబోరాజో శిఖరం ఎత్తు 6,268 మీటర్లు మాత్రమే. కానీ ఎవరెస్ట్తో పోలిస్తే చింబోరాజో చంద్రుడికి 2.4 కిలోమీటర్లు సమీపంలో ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. చిన్న ప్రాంతాల వారీగా కాకుండా దేశాల వారీగా చూస్తే ఈక్వెడార్, కెన్యా, టాంజానియా, ఇండోనేసియా వంటివి భూమ్మీద మిగతా దేశాల కన్నా చంద్రుడికి, స్పేస్కు దగ్గరగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సరిగ్గా భూమి మధ్య నుంచి చూస్తే భూమధ్యరేఖకు కాస్త దిగువన ఉన్న ప్రాంతం ఉబ్బెత్తుగా ఉంటుందని, ఈ దేశాలన్నీ ఆ ప్రాంతంలోనే ఉన్నాయని వెల్లడిస్తున్నారు. భూమి ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాలతో పోలిస్తే ఈ దేశాల్లోని జనం చంద్రుడికి సుమారు 21 కిలోమీటర్లు అనగా 13 మైళ్లు దగ్గరగా ఉన్నట్టేనట..
Related News
Nuclear Power Plant On Moon: చంద్రుడిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్.. రష్యా-చైనా దేశాలు సంయుక్తంగా సన్నాహాలు..!
2033-35 నాటికి చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ (Nuclear Power Plant On Moon)ను ఏర్పాటు చేసేందుకు రష్యా, చైనాలు సన్నాహాలు చేస్తున్నాయి.