Cartwheels: రైల్వే ప్లాట్ ఫామ్ పై అలాంటి విన్యాసాలు చేసిన యువకుడు.. వీడియో వైరల్ కావడంతో?
సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం రకరకాల విన్యాసాలు పిచ్చిపిచ్చి స్టంట్లు చేస్తున్నారు. పబ్లిక్ లో ఉన
- By Nakshatra Published Date - 05:50 PM, Thu - 13 July 23
సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం రకరకాల విన్యాసాలు పిచ్చిపిచ్చి స్టంట్లు చేస్తున్నారు. పబ్లిక్ లో ఉన్న మా ప్రైవేట్ కేసులో ఉన్నావా అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా కొంతమంది ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. కొంతమంది పబ్లిక్ లో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రైల్వే స్టేషన్ లలో బస్టాండ్ లలో మెట్రో ట్రైన్స్ లో ఈ విధంగా విన్యాసాలు చేసి వైరల్ అవ్వడం అన్నది ట్రెండింగ్ గా మారిపోయింది.
ట్రెండింగ్ సంగతి పక్కన పెడితే ఈ విన్యాసాలు చేసి ఆ వీడియోలు వైరల్ అవ్వడంతో కటకటాల పాలవుతున్నారు. తాజాగా అటువంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఒక యువకుడు రైల్వేస్టేషన్లో జిమ్నాస్టిక్స్ విన్యాసాలు ప్రదర్శించిన వీడియో తాజాగా వైరల్ గా మారింది. అయితే, యువకుడి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేశారు. సంబంధిత వీడియోను ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. బిహార్లోని మాన్పుర్ జంక్షన్ లో ఈ ఘటన వెలుగుచూసింది.
ఆ వీడియోలో రైలు ప్లాట్ఫారంపై నిలబడి ఉండగా కొందరు ప్రయాణికులు రైలు ఎక్కుతుండగా మరికొందరు బయట నిల్చొని ఉన్నారు. ఇంతలోనే ఒక యువకుడు అందరూ చూస్తుండగా ప్లాట్ ఫామ్ పై జిమ్నాస్టిక్ విన్యాసాలు ప్రదర్శించాడు. ఆ వీడియోని కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అధి కాస్త వైరల్ గా మారింది. ఇంకేముంది వెంటనే రైల్వే అధికారులు పోలీసులు అరెస్టు చేశారు.
A young man who gained fame for his reckless stunts at Manpur Junction, was arrested by #RPF for creating nuisance and unauthorized entry.
We hope this will serve as a lesson for others who put their lives at risk for likes and shares in social media. #SafetyFirst pic.twitter.com/qDCj9H9mFK
— RPF INDIA (@RPF_INDIA) July 10, 2023
ఆ వీడియో పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇటువంటి ప్రదేశాలలో మరొకసారి అలాంటి స్టంట్ లు చేయాలి అంటే భయపడాలి వారికి గట్టిగా బుద్ధి చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆ యువకుడిని అరెస్టు చేయడాన్ని తీవ్రమైన చర్యగా పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేసి ఉండాల్సిందిగా అభిప్రాయపడ్డారు. అరెస్టు చేయడానికి బదులు స్టేషన్ పరిసరాల్లో సామాజిక సేవ చేయించడం వంటి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని మరొకరు స్పందించారు.
Related News
Central Govt: ఆధునిక హంగులతో వికారాబాద్ రైల్వే స్టేషన్, అభివృద్ధికి 24.35 కోట్లు!
Central Govt: దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి 24.35 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.ఇందులో భాగంగా మంజూరు అయిన నిధులతో రైల్వే స్టేషన్ ను ఆధునిక హంగులతో తీర్చి ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ఎసి గది, ఎక్స్ లెటర్, నిర్మించనున్నారు. ప్రయాణికుల�