UCC – Uttarakhand : దేశంలోనే తొలిసారి యూసీసీ.. సంచలన ప్రతిపాదనలివీ
UCC - Uttarakhand : ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై ఇప్పటిదాకా దేశంలో చర్చ జరిగిందే తప్ప.. ఏ రాష్ట్రంలోనూ అది అమల్లోకి రాలేదు.
- By Pasha Published Date - 09:24 AM, Sun - 4 February 24
UCC – Uttarakhand : ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై ఇప్పటిదాకా దేశంలో చర్చ జరిగిందే తప్ప.. ఏ రాష్ట్రంలోనూ అది అమల్లోకి రాలేదు. తొలిసారిగా యూసీసీని అమల్లోకి తెచ్చే దిశగా ఉత్తరాఖండ్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈనెల 5(సోమవారం) నుంచి 8 (గురువారం) వరకు జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాలు ఇందుకు వేదికగా నిలువబోతున్నాయి. ఈనెల 6వ తేదీ వెరీ స్పెషల్గా నిలువబోతోంది. ఎందుకంటే.. ఆ రోజున అసెంబ్లీలో యూసీసీ ముసాయిదా బిల్లుపై చర్చ మొదలుకానుంది. ఈ సెషన్లో ఎలాగైనా యూసీసీ బిల్లుకు ఆమోదం తెలిపి చట్టరూపంలోకి తేవాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే.. స్వాతంత్య్ర భారత చరిత్రలో యూసీసీ తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ రూపొందించిన యూసీసీ ముసాయిదా బిల్లును(UCC – Uttarakhand) ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. అయితే దానిలోని కొన్ని అంశాలు తాజాగా బయటికొచ్చాయి. అవేంటో చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
యూసీసీ ముసాయిదా బిల్లులోని అంశాలివీ..
- మహిళలు, పురుషులకు సమానమైన వారసత్వ హక్కులను కల్పించడం.
- వివాహాల రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేయడం. వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోని జంటలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు లభించవు.
- పెళ్లిళ్ల నమోదుకు గ్రామాల స్థాయిలోనూ ఏర్పాట్లు చేస్తారు.
- అమ్మాయిలకు వివాహ వయసును పెంచనున్నారు. దీనివల్ల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే యువతుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
- దత్తత హక్కులు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. ముస్లిం మహిళలకూ ఇవి వర్తిస్తాయి. దత్తత ప్రక్రియనూ సరళీకరిస్తారు.
- అన్ని వర్గాల్లో బహు భార్యత్వం, బాల్య వివాహాలపై నిషేధం విధిస్తారు.
- అన్ని మతాలకు చెందిన అమ్మాయిలకు ఒకే విధమైన కనీస వివాహ వయసు ఉంటుంది.
- విడాకులకు సంబంధించి అన్ని మతాలవారికి ఒకే తరహా నిబంధనలు ఉంటాయి.
- హలాల్, ఇద్దత్ పద్ధతులపై నిషేధం విధిస్తారు.
- సహజీవనం సాగిస్తున్నవారు దానిపై డిక్లరేషన్ తప్పనిసరిగా ప్రభుత్వానికి అందించాలి.
- అన్ని వర్గాలవారు కోర్టుల ద్వారానే విడాకులను పొందాలి.
- తల్లిదండ్రుల మధ్య వివాదం నడుస్తుంటే వారి పిల్లలను అమ్మమ్మ/ నానమ్మ, తాతయ్యలకు అప్పగిస్తారు.
- కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే.. భార్యకు అందే పరిహారంలో మృతుడి తల్లిదండ్రులకూ వాటా ఉంటుంది. ఒకవేళ భార్య మరో వివాహం చేసుకున్నా.. మొదటి భర్త మరణం వల్ల అందే పరిహారాన్ని అతడి తల్లిదండ్రులకు వాటా ఇవ్వాలి. ఒకవేళ భార్య చనిపోతే ఆమె తల్లిదండ్రులను చూసుకునేవారు లేకపోతే భర్తే ఆ బాధ్యతను తీసుకోవాలి.
- ఉత్తరాఖండ్ జనాభాలోని 3 శాతం మంది ఎస్టీలను యూసీసీ పరిధి నుంచి మినహాయిస్తారు.
- యూసీసీ ముసాయిదా బిల్లులోని పై నిబంధనలలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Related News
Kedarnath Dham : ఈనెల 10న తెరుచుకోనున్న కేదార్నాథ్ ధామ్
Kedarnath Dham: ఉత్తరాఖండ్(Uttarakhand)లోని కేదార్నాథ్ ధామ్(Kedarnath Dham)లో కేదరానాథునికి తలుపులు తెరవడానికి ముందు నిర్వహించే ప్రత్యేక పూజ ఆచారాల శ్రేణి ఆదివారం ప్రారంభమైంది. దీంతో భక్తులకు ఈ నెల 10 నుంచి కేదార్నాథ్ దర్శనానికి అనుమతి ఇస్తారు. కేదార్నాథ్, మధ్మహేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పనాథ్ (శివుని ఐదు పూజ్యమైన పుణ్యక్షేత్రాలు) ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివ�