Nobel Prize : ఉక్రెయిన్ శరణార్ధుల పిల్లల కోసం.. వేలానికి నోబెల్ ప్రైజ్!!
నోబెల్ బహుమతి.. ప్రపంచంలో అత్యంత గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెట్టే అవార్డు. వివిధ రంగాల ఉద్దండులకు మాత్రమే దీన్ని ఇస్తారు.
- By Hashtag U Published Date - 12:00 PM, Tue - 21 June 22
నోబెల్ బహుమతి.. ప్రపంచంలో అత్యంత గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెట్టే అవార్డు. వివిధ రంగాల ఉద్దండులకు మాత్రమే దీన్ని ఇస్తారు. కానీ రష్యాకు చెందిన నోబెల్ గ్రహీత, జర్నలిస్టు దిమిత్రి మురటోవ్ తనకు వచ్చిన నోబెల్ ప్రైజ్ ను వేలానికి పెట్టారు. ఇప్పుడు దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒక గొప్ప కారణం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వేలం ద్వారా వచ్చే డబ్బులను .. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన పిల్లలకు సాయం చేయడానికి ఉపయోగిస్తానని మురటోవ్ ప్రకటించారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఉక్రెయిన్ పిల్లలకు సహాయం చేయడానికి “యూనిసెఫ్” చేస్తున్న ప్రయత్నాలకు ఈ వేలం డబ్బు నేరుగా అందుతుందని తెలిపారు.దానితో పాటు 500,000 డాలర్ల క్యాష్ ప్రైజ్ను ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తున్నట్లు మురటోవ్ ప్రకటించారు. అయితే నోబెల్ ప్రైజ్ వేలానికి సంబంధించిన లైవ్ బిడ్డింగ్ “ప్రపంచ శరణార్ధుల దినం” సందర్భంగా సోమవారం మధ్యాహ్నం న్యూయార్క్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మురటోవ్ కూడా పాల్గొన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా జూన్ 1న కూడా ఆన్లైన్ బిడ్లు స్వీకరించారు. గరిష్టంగా రూ.4.50 కోట్లు ( 550,000 డాలర్లు) బిడ్ విలువ చేరొచ్చని అంచనా వేస్తున్నారు.
ఎవరీ మురటోవ్ ?
ప్రముఖ రష్యన్ దినపత్రిక “నోవయా గెజెటా”కు దిమిత్రి మురటోవ్ ఎడిటర్. జర్నలిజంలో చేసిన విశేషమైన కృషికి గానూ ఆయనను నోబెల్ వరించింది. 2021లో ఫిలిప్పైన్స్కు చెందిన మారియా రెసాతో కలిసి సంయుక్తంగా మురటోవ్ కు నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. కాగా, ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన నేపథ్యంలో.. పుతిన్ సర్కారు జర్నలిస్టుల గొంతు నులుముతోంది.ఈనేపథ్యంలో మార్చిలో నోవయా గెజెటా పత్రిక మూతపడింది. ఆ సమయానికి.. దాని ఎడిటర్-ఇన్-చీఫ్గా మురటోవ్ పనిచేస్తున్నారు. పుతిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నోవయా గెజెటా వార్తాపత్రికలో పనిచేసిన దాదాపు రెండు డజన్ల మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్లో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రెడ్ పెయింట్తో తనపై దాడి జరిగినట్లు మురటోవ్ చెప్పారు.
రష్యా దురాక్రమణపై అభిప్రాయం..
ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణను ముందు నుంచీ మురటోవ్ ఖండిస్తూనే ఉన్నారు. “ప్రస్తుతం రష్యా ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ప్రభుత్వ అనుకూల పత్రికలు మాత్రమే పనిచేస్తున్నాయి. నా నోబెల్ ప్రైజ్ వేలం ఈవెంట్ను కూడా మా పత్రికలో ప్రచురించలేకపోవచ్చు” అని
Related News
National Science Day : రూ.200 విలువచేసే పరికరాలతో ‘నోబెల్’.. హ్యాట్సాఫ్ సీవీ రామన్
National Science Day : సర్ సీవీ రామన్.. భారతజాతి ముద్దుబిడ్డ. వైజ్ఞానిక ఆవిష్కరణల్లో భారతీయులు కూడా నోబెల్ ప్రైజ్ సాధించగలరని నిరూపించిన ఘనుడు ఆయన.