Paris 2024 Olympics: వామ్మో.. ఒక టిక్కెట్ ధర రూ. 4 కోట్లు.. ఎక్కడ కొనాలో తెలుసా..?
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడ అయిన పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈవెంట్లు 26 జూలై 2024 నుండి ప్రారంభమవుతాయి.
- By Gopichand Published Date - 01:20 PM, Sun - 5 May 24
Paris 2024 Olympics: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడ అయిన పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris 2024 Olympics) కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈవెంట్లు 26 జూలై 2024 నుండి ప్రారంభమవుతాయి. ఆగస్టు 11 వరకు కొనసాగుతుంది. దాదాపు 19 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీలో 32 క్రీడాంశాల్లో 329 మంది ఆహ్వానితులే ఉంటారని, ఇందులో దాదాపు 10 వేల 500 మంది క్రీడాకారులు తమ క్రీడా ప్రతిభను కనబర్చనున్నారు. అయితే పారిస్ ఒలింపిక్స్ 2024 టిక్కెట్లు, ప్యాకేజీలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం క్రీడా ప్రేమికులకు వెలుగులోకి వచ్చింది. ప్యాకేజీని తీసుకోవడం ద్వారా ప్రేక్షకులు లైవ్ ఈవెంట్ను వీక్షించగలుగుతారు. క్రీడా గ్రామాన్ని సందర్శించే అవకాశం, క్రీడాకారులను కలిసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్యాకేజీ టిక్కెట్ ధర సుమారు రూ.4.16 కోట్లు అని మీకు తెలుసా?
ప్రారంభ వేడుకలను చూసే అవకాశం లభిస్తుంది
‘ది గార్డియన్’ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 5 లక్షల డాలర్లు (4.16 కోట్లు) వెచ్చించి ప్యాకేజీని కొనుగోలు చేస్తున్నారు. ప్యాకేజీకి ‘అల్ట్రా-ఎక్స్క్లూజివ్’ అని పేరు పెట్టారు. బాస్కెట్బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ బిజినెస్ మేనేజర్, టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ PR మేనేజర్ తమ కంపెనీ ‘GR8 ఎక్స్పీరియన్స్’ బ్యానర్లో ప్యాకేజీలను విక్రయిస్తున్నారు. ఒలంపిక్స్ ప్రారంభ వేడుకలు కూడా ప్యాకేజీ కింద చూడనున్నారు. అదనంగా ప్యాకేజీలో 14 ఈవెంట్లు, ప్రత్యేక పురుషుల 100మీ ఫైనల్ రేసు ఉన్నాయి. ప్యాకేజీ కొనుగోలుదారులు క్రీడా గ్రామాన్ని సందర్శించగలరనే సమాచారం వెల్లడి కానప్పటికీ,వారు టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్తో విందు చేసే అవకాశం కూడా పొందవచ్చు.
The #OLYMPIAS Trireme in Piraeus Port, as part of the Events of the Olympic Flame for #Paris2024.
🇬🇷🔥🇫🇷
The French sailing ship #BELEM, which transfers the Olympic Flame for the Paris 2024 Olympic Games to Marseille, crosses the canal of the Corinth Isthmus, Peloponnese, Greece. pic.twitter.com/UiRejVum88— Diogenes of Sinope (@DiogenisSinopis) April 29, 2024
పారిస్ మూడోసారి ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తోంది
మీడియా నివేదికల ప్రకారం.. అధికారిక వెబ్సైట్కి లాగిన్ చేయడం ద్వారా పారిస్ ఒలింపిక్స్ టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. వివిధ గేమ్లు, విభిన్న ఈవెంట్లకు టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఒలింపిక్ క్రీడలు మూడవసారి పారిస్లో జరుగుతున్న విషయం తెలిసిందే. పారిస్ గతంలో 1900, 1924లో ఒలింపిక్ క్రీడలను నిర్వహించింది. ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత 2024లో పారిస్లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి.
We’re now on WhatsApp : Click to Join
Tags
Related News
Boxer suspended: భారత్కు బ్యాడ్ న్యూస్.. పారిస్ ఒలింపిక్స్కు బాక్సర్ దూరం, కారణమిదే..?
పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం అథ్లెట్లందరూ హృదయపూర్వకంగా సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే భారత్కు బ్యాడ్ న్యూస్ వస్తున్నాయి.