Diamond Ring: వామ్మో.. 24,679 వజ్రాలు పొదిగిన ఉంగరం.. ఎవరి దగ్గర ఉందొ తెలుసా?
సాధారణంగా చాలామంది మంచి మంచి కాస్ట్లీ డైమండ్ లు కలిగిన ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. ఇంకా బాగా
- By Nakshatra Published Date - 08:15 AM, Sun - 17 July 22
సాధారణంగా చాలామంది మంచి మంచి కాస్ట్లీ డైమండ్ లు కలిగిన ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. ఇంకా బాగా ధనవంతులు కోటీశ్వరులు అయితే చిన్న చిన్న డైమండ్లతో పొదిగిన పెద్ద పెద్ద ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. ఇంకొందరు మాత్రం ఓకే డైమండ్ ఉన్న ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు. ఇలా వజ్రాలు పొదిగిన ఉంగరాలు ఎన్నో రకాలుగా రకరకాల మోడల్స్ లభిస్తూ ఉంటాయి. కాగా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఉంగరం గురించి తెలిస్తే తప్పకుండా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ ఉంగరంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24,679 వజ్రాలు పొదిగి ఉన్నాయట.
ఒక్క ఉంగరంలో అన్ని వజ్రాలు ఏంటా అనే ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. మరి ఆ ఉంగరం ఎక్కడ ఉంది? ఆ ఉంగరాన్ని ఎవరు ధరించారు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..కేరళలోని కోజికోడ్కు చెందిన ఎస్డబ్ల్యుఏ డైమండ్స్ తాజాగా 24,679 వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారుచేసింది. ఈ డైమండ్ రింగ్ పింక్ ఓస్టెర్ మష్రూమ్ ప్రేరణగా నిలిచింది. గతంలో 12,638 వజ్రాలు అమర్చిన రింగ్ రూపొందించిన వారు ఈసారి ఏకంగా 24,679 డైమండ్లతో ఉంగరాన్ని తయారు చేశారు.
పాత రికార్డును ఈ కొత్త రింగు బద్దలు కొట్టింది. ది టచ్ ఆఫ్ అమీని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విద్యార్థి రిజిషా టివి రూపొందించారు. అయితే ఈ ఉంగరాన్ని తయారు చేయడానికి 90 రోజుల పాటు శ్రమించారట. ఈ రింగ్లోని అన్ని వజ్రాలు కేపీసీఎస్ సర్టిఫికేట్ పొందాయట. టచ్ ఆఫ్ అమీ ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించుకుంది. వజ్రాల పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న భారత్ ఈ ఘనత సాధించడంపై తాము ఎంతో సంతోషిస్తున్నామని ఎస్ డబ్ల్యూఏ నిర్వాహకులు తెలిపారు. ఈ రింగుకీ సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
Related News
Kerala: మహిళపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
కేరళలోని కన్నూర్లో మహిళపై లైంగిక వేధింపుల ఉదంతం వెలుగు చూసింది. ఈ కేసులో చర్యలు తీసుకున్న పోలీసులు కేరళ సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ను అరెస్ట్ చేశారు.