HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Delhi Ias Coaching Institute Incident Tomorrow Hearing In Supreme Court

Delhi : ఢిల్లీ ఐఏఎస్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఘటన..రేపు సుప్రీంకోర్టులో విచారణ..!

Delhi : ముగ్గురు యూపీఎస్సీకి సిద్ధమవుతున్నారు. మృతుల్లో తెలంగాణకు చెందిన తాన్యా సోని, కేరళకు చెందిన నవీన్‌ డాల్విన్‌, యూపీకి చెందిన శ్రేయా యాదవ్‌ ఉన్నారు. ఈ ఘటనపై ఆగస్టు 5న సుప్రీంకోర్టు విచారణ జరిపిన విషయం తెలిసిందే.

  • Author : Latha Suma Date : 20-10-2024 - 4:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delhi IAS Coaching Institute incident..Tomorrow hearing in Supreme Court..!
Delhi IAS Coaching Institute incident..Tomorrow hearing in Supreme Court..!

Supreme Court : ఢిల్లీలోని ఓ ఐఏఎస్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ముగ్గురు విద్యార్థుల మృతికి సంబంధించిన కేసుపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనున్నది. జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం సోమవారం విచారణ జరుపనున్నట్లు కోర్టు వెబ్‌సైట్‌ పేర్కొంది. సెప్టెంబర్‌ 20న కోచింగ్‌ సెంటర్‌ తరహా ఘటనలను నిరోధించేందుకు తీసుకున్న మధ్యంతర చర్యలను వివరించాలని.. మరణాలకు కారణాలపై దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలోని ఓల్డ్‌ రాజేంద్రనగర్‌లో జూలై 27న సంభవించిన వరదల కారణంగా రావూస్ అకాడమీ బేస్‌మెంట్‌లో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

ముగ్గురు యూపీఎస్సీకి సిద్ధమవుతున్నారు. మృతుల్లో తెలంగాణకు చెందిన తాన్యా సోని, కేరళకు చెందిన నవీన్‌ డాల్విన్‌, యూపీకి చెందిన శ్రేయా యాదవ్‌ ఉన్నారు. ఈ ఘటనపై ఆగస్టు 5న సుప్రీంకోర్టు విచారణ జరిపిన విషయం తెలిసిందే. విచారణ సమయంలో కోచింగ్‌ సెంటర్లు డెత్‌ ఛాంబర్లుగా మారాయని.. ఈ ఘటన అందరి కళ్లు తెరిపించేలా ఉందని వ్యాఖ్యానించింది. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు భద్రతా ప్రమాణాలు, గౌరవప్రదమైన జీవితానికి సంబంధించిన ప్రాథమిక నిబంధనలకు పూర్తి అనుగుణంగా ఉండే వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఆదేశించింది. వాస్తవానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల జీవితాలతో కోచింగ్ సెంటర్లు ఆటలాడుకుంటున్నట్లు విమర్శలున్నాయి. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వానికి సీఎస్‌ నివేదికను సమర్పించారు.

రాజేంద్ర నగర్‌లోని రావూస్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా బ్లాక్ చేసిందని.. ఇన్‌స్టిట్యూట్‌లో రెస్క్యూ సిస్టమ్ లేదని పేర్కొన్నారు. కోచింగ్ సెంటర్ నడుస్తున్న భవనం పార్కింగ్ ఎత్తు చుట్టుపక్కల ఆస్తుల కంటే తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. భారీ వరద రాకుండా పార్కింగ్‌ ప్రాంతం, గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి వర్షపు నీరు చేరకుండా ప్రహరీ గోడలు ఏర్పాటు చేశారన్నారు. వరదలతో నీరు ప్రహరీ గోడలను దాటి గ్రౌండ్‌ ఫ్లోర్‌లోకి వచ్చిందని.. ఇందులో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ఎండీసీ నివేదిక పేర్కొంది. ఢిల్లీ హైకోర్టులోనూ ఈ అంశంపై విచారణ జరిగింది. విద్యార్థుల మృతిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌ నేతృత్వంలోని బెంచ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also: Marathon : జమ్మూకశ్మీర్‌ తోలి మారాథాన్‌ను ప్రారంభించిన సీఎం ఒమర్‌ అబ్దుల్లా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Court website
  • Delhi Coaching Center
  • Justice Suryakant
  • Justice Ujjal Bhuyan
  • Supreme Court

Related News

Supreme Court Strong Warning To YCP MLC Anantha Babu

అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో సుప్రీంకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం

Ananta Babu case  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో పోలీసులు ఈ కేసు విషయంలో వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థలు, నిందితుడు ఒక్కటయ్యారు అనే రీతిలో వ్యవహరించారని మండిపడింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును వ

  • Telangana Cm Revanth Reddy

    CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • Ias Srilakshmi

    ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

  • Prathyusha Death Case

    Actress Pratyusha Case : నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడికి సుప్రీం కోర్టు బిగ్ షాక్

Latest News

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

  • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

Trending News

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd