Bomb Blast-Toilet : టాయిలెట్ లో బాంబు పేలుడు.. బాలుడి మృతి
పబ్లిక్ టాయిలెట్ వద్ద బాంబు(Bomb Blast-Toilet) పేలింది. ఈ ఘటనలో 11 ఏళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు.
- By Pasha Published Date - 01:51 PM, Mon - 5 June 23
పబ్లిక్ టాయిలెట్ వద్ద బాంబు(Bomb Blast-Toilet) పేలింది. ఈ ఘటనలో 11 ఏళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. సోమవారం ఉదయం పశ్చిమ బెంగాల్ లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుభాస్పల్లికి చెందిన ఈ బాలుడు.. బొంగావ్ ప్రాంతంలోని రైలు గేట్-1 సమీపంలోని ఒక పబ్లిక్ టాయిలెట్కు వెళ్ళాడు. అయితే అప్పటికే గుర్తు తెలియని దుండగులు ఆ టాయిలెట్ లో(Bomb Blast-Toilet) ఉంచిన బాంబులు పేలాయి.
Also read : Robber Emotional : హగ్ తో దొంగ ఎమోషనల్.. కట్ చేస్తే..
ఆ టైంలో పబ్లిక్ టాయిలెట్ లోనే ఉన్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడికి ఎక్కువగా రక్త స్రావం కూడా జరిగింది. బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పబ్లిక్ టాయిలెట్లో బాంబులు దాచిన వాళ్ళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Related News
Rama Navami: రామనవమి వేడుకలో హింసాత్మక ఘటన.. 20 మందికి గాయాలు
Sri Rama Navami: పశ్చిమ బెంగాల్(West Bengal)లోని ముర్షిదాబా(Murshidabad)లోని రెజీనగర్ ప్రాంతంలో రామనవమి ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శోభాయాత్ర(Shobhayatra) నిర్వహిస్తున్న వారిపై పలువురు రాళ్లదాడి(Stone pelting)చేశారు. దీంతో దాదాపు 20 మంది గాయపడ్డారు. మరియు ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. కాగా, ఊరేగింపు ముగిసే సమయానికి క్రూడ్ బాంబు పేలినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పోలీసులు ధృవీకరించలేదు. We