Amitabh – Ayodhya : అయోధ్యలో స్థలం కొన్న అమితాబ్.. డీల్ వివరాలివీ..
Amitabh - Ayodhya : బిగ్ బీ అమితాబ్ బచ్చన్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- By Pasha Published Date - 08:23 PM, Mon - 15 January 24
Amitabh – Ayodhya : బిగ్ బీ అమితాబ్ బచ్చన్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయోధ్యలో అమితాబ్ భూమిని కొన్నారనేది ఆ వార్త సారాంశం. దీంతో అయోధ్యలోని భూమి రేట్లు, అమితాబ్ కొన్న స్థలంపై అంతటా చర్చ మొదలైంది. మరో వారం రోజుల్లో (జనవరి 22న) అయోధ్య రామమందిరం ప్రారంభం కానున్న తరుణంలో.. ఆ పుణ్యభూమిలో అమితాబ్ స్థలాన్ని కొన్నారనే వార్త ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయోధ్యలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు కల్పించేందుకే.. అమితాబ్ వార్తను వైరల్ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ‘హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (హెచ్ఏబీఎల్)’ అయోధ్యలో అభివృద్ది చేసిన 51 ఎకరాల వెంచర్లో అమితాబ్ భూమిని కొన్నారని తెలుస్తోంది. అమితాబ్ ప్లాట్ ‘సెవెన్ స్టార్ మల్టీ పర్పస్ ఎన్క్లేవ్ ది సరయూ’లో ఉందని అంటున్నారు. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భూమిలో సొంతింటిని అమితాబ్ కట్టుకోనున్నాని అంటున్నారు. అయోధ్యలో స్థలం కొనుగోలుకు అమితాబ్ రూ.14.5 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఈ స్థలం రామమందిరానికి 10 నిమిషాల దూరంలో, అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయంకు 20 నిమిషాల దూరంలో, సరయూ నదికి 2 నిమిషాల దూరంలో ఉందట.
We’re now on WhatsApp. Click to Join.
2028 నాటికల్లా ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్ఏబీఎల్ యాజమాన్యం వెల్లడించింది. తమ ప్రాజెక్టులో మొదటి ప్లాట్ ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొనడంపై ఆ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. ది హౌజ్ ఆఫ్ అభినందన్ లోధా షేర్ చేసిన బ్రోచర్లో అయోధ్య భూమి వివరాలు ఇలా ఉన్నాయి. తమ వెంచర్లో 1250 చదరపు అడుగల భూమి ధర రూ.1.80కోట్లు ఉండగా.. 1500 చదరపు అడుగు ప్లాట్ధర రూ.2.35 కోట్లుగా ఉందని హెచ్ఏబీఎల్ పేర్కొంది. 1750 చదరపు అడుగుల స్థలం ధర రూ.2.50 కోట్లు పలుకుతున్నట్టు సదరు సంస్థ వెల్లడించింది. ఇక అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్, రణ్బీర్ కపూర్ ఆయన భార్య అలియా భట్, బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ హిరాణీ, దర్శకుడు రోహిత్ శెట్టి, సూపర్స్టార్ రజనీకాంత్, కోలివుడ్ స్టార్ హీరో ధనుష్లకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. వారు స్వయంగా శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను(Amitabh – Ayodhya) వీక్షించనున్నారు.
Also Read: ED – Kavitha : పండుగ పూట కవితకు ఈడీ సమన్లు.. రేపే విచారణ
Related News
Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..
ప్రభాస్ 'కల్కి' రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేసింది. ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఎప్పుడు రాబోతుందంటే..