2 Women Stripped : పశ్చిమ బెంగాల్లో మణిపూర్ తరహా ఘటన..
మణిపూర్ లో రెండు నెలలుగా అక్కడ మెయితెయ్, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి
- By Sudheer Published Date - 01:10 PM, Sat - 22 July 23

మణిపూర్ (Manipur Incident) ఈ పేరు గత కొద్దీ రోజులుగా దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. రెండు నెలలుగా అక్కడ మెయితెయ్, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయం భయం గా బ్రతుకుతున్నారు. ప్రతి రోజు ఎక్కడో చోట అల్లర్లు , హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఈ ఘటనల వల్ల దాదాపు 130 మంది చనిపోయారు. మే 4వ తేదీన తౌబాల్ జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన వెలుగులోకి వచ్చి సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.
ఈ ఘటన ఫై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆందోళన నడుస్తుండగా..తాజాగా పశ్చిమ బెంగాల్ (MANIPUR OR WEST BENGAL )లోనూ అలాంటి ఘటనే జరిగింది. ఇద్దరు మహిళలను చావబాది అర్ధనగ్నంగా ఊరేగించారు. ఈ ఘటన మల్దాలోని పకౌహట్లో జరిగింది. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. దొంగతనానికి పాల్పడ్డారన్న అనుమానంతో ఇద్దరు మహిళలను పట్టుకున్న స్థానికులు వారిని ఈడ్చిపడేసి దాడిచేశారు. వారిలో ఎక్కువమంది మహిళలే కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. దీనిపై బెంగాల్ బీజేపీ సెంట్రల్ కో-ఇంఛార్జి అమిత్ మాల్వియా ట్వీట్ చేసి మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ వీడియోను బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
It is not matter of states whether MANIPUR OR WEST BENGAL every daughter of this country deserves respect irrespective of politics,cast and creed.
As per concerned of the required evidence here are the shocking and horrific visuals of how women are assaulted in OF MALDA WB pic.twitter.com/MnZDl50mVh— Locket Chatterjee (@me_locket) July 22, 2023