YS Sharmila: నాకు మా అన్నతో గొడవలేమీ లేవు – షర్మిల
జగన్ తో విభేదాల కారణంగానే వైస్ షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టిందని , జగన్ సీఎం అయ్యాక షర్మిలను పక్కన పెట్టాడని , ఆ కోపం తోనే జగన్ కు దూరంగా షర్మిల ఉంటుందని ఇలా అనేక రకాల వార్తలు ప్రచారం అవుతూ వస్తున్నాయి.
- By Hashtag U Published Date - 08:43 PM, Mon - 7 November 22
జగన్ తో విభేదాల కారణంగానే వైస్ షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టిందని , జగన్ సీఎం అయ్యాక షర్మిలను పక్కన పెట్టాడని , ఆ కోపం తోనే జగన్ కు దూరంగా షర్మిల ఉంటుందని ఇలా అనేక రకాల వార్తలు ప్రచారం అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో షర్మిల వాటికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. సోమవారం నాటి పాదయాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన షర్మిల… తనకు తన సోదరుడితో ఎలాంటి గొడవలు లేవని తెలిపారు. తన సోదరుడితో తనకు గొడవలు ఉన్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని తెలిపింది.
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు… సోదరుడితో గొడవలు ఉంటే ఏపీలో పార్టీ పెట్టుకోవాలని, అందుకు విరుద్ధంగా తెలంగాణలో పార్టీ ఎలా పెట్టుకుంటారని కేటీఆర్ అన్నట్లు షర్మిల చెప్పారు. కేటీఆర్ చెప్పిన సామెత నిజమేనని… అత్త మీద కోపాన్ని తాను దుత్త మీద చూపడం లేదన్నారు. తన సోదరుడితో తనకేమీ గొడవలు లేవన్నారు. అందుకే తాను ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ పెట్టుకున్నానని ఆమె తెలిపింది.
ప్రజాప్రస్థానం పాదయాత్ర 202వ రోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తేనుగుగూడెం, బట్వాన్ పల్లి, మన్నెగూడెం, పెర్కపల్లి మీదుగా సాగుతోంది. సాయంత్రం నెన్నెల మండలం అవదం గ్రామంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకోబోతున్నా.#PrajaPrasthanam #Bellampalli pic.twitter.com/st8wjh6xpZ
— YS Sharmila (@realyssharmila) November 7, 2022
Related News
Chandrababu : తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా.. చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా?
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చని, తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేమని చెప్పారు.