Komatireddy On Revanth: రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందే!
టీక్రాంగెస్ స్టార్ క్యాంపెయినర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య రోజురోజుకూ మరింత గ్యాప్ పెరిగిపోతోంది.
- By Balu J Published Date - 07:15 PM, Fri - 12 August 22
టీక్రాంగెస్ స్టార్ క్యాంపెయినర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య రోజురోజుకూ మరింత గ్యాప్ పెరిగిపోతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తనకు క్షమాపణ చెప్పిన తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని రేవంత్పై ప్రత్యేక ఇంటర్వ్యూలో మండిపడ్డారు. శనివారం మునుగోడులో చేపట్టనున్న కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొనాల్సిందిగా తనను ఎవరూ ఆహ్వానించలేదని వెంకట్ రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ తన ఇంటికి రాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
చండూరులో జరిగిన బహిరంగ సభలో కొందరు కాంగ్రెస్ నేతలు తనపై విమర్శలు చేశారని ఎంపీ ఆరోపించారు. నాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు బహిరంగ సభలోనే రేవంత్ తనను (దయాకర్) హెచ్చరించి ఉండాల్సిందని ఆయన అన్నారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజ్గోపాల్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ కాంగ్రెస్లోనే కొనసాగుతానని రేవంత్కి ముందే తెలియజేశానని వెంకట్ రెడ్డి తెలిపారు.
Related News
Bandi Sanjay: తెలంగాణ ఖజనా ఖాళీ అయ్యింది.. జీతాలు ఇవ్వడమే గగనం
Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కీలక నేతలతో బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. అన్ని సర్వే నివేదికలు ఇవే చెబుతున్నాయి. బీజేపీ గెలుపులో ప్రధాన భూమిక మీదే. పోలింగ్ నాటికి ప్రతి ఓటర్ ను 7 సార్లు కలవాలి. పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ద్రుష్టి స