HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >What Is Happening In Gandhi Bhavan

Telangana Congress: గాంధీభవన్‌లో అసలేం జరుగుతోంది?

తెలంగాణ కాంగ్రెస్ (Congress) పరిస్థితి ఘోరంగా తయారైంది. కమిటీల పేరుతో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

  • Author : Balu J Date : 15-12-2022 - 11:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tcongress, tpcc
Tcongress

ఒకవైపు టీఆర్ఎస్ బీఆర్ఎస్ (BRS)గా మారి దూకుడు ప్రదర్శిస్తుంటే, మరోవైపు బీజేపీ (BJP) ప్రజా సంగ్రామ యాత్రల పేరుతో జనాల్లో వెళ్తుంటే.. టీకాంగ్రెస్ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సీనియర్స్, జూనియర్స్ అంటూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ (Tcongress) పరిస్థితి ఎక్కడా వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ కమిటీలు ప్రకటించినప్పటినుంచి పరిస్థితి అదుపు తప్పింది. పీసీసీ, డీసీసీలకు కమిటీలతో పాటు..రాష్ట్ర స్థాయిలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేస్తూ హైకమాండ్ ప్రకటన జారీ చేసింది. ఢిల్లీ నుంచి ప్రకటన వచ్చినప్పటినుంచీ టీ కాంగ్రెస్ లో  రచ్చ రచ్చ అవుతోంది. పదవులు రానివారు, వచ్చిన పదవి నచ్చనివారు, తమవారికి అడిగిన పదవులు రానివారు.. ఇలా నానా రకాల నాయకులంతా కమిటీల ఏర్పాటుపై అసహనం, ఆగ్రహం, ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. ముఖ్యంగా సీనియర్లంతా కమిటీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీల ఏర్పాటులో తమను అవమానించారని మండిపడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించినవారు.. ఆయన్ను సమర్థించినవారు కూడా కమిటీల విషయంలో భగ్గుమంటున్నారు.

కాంగ్రెస్ (TCongress) పై నుంచి కింది వరకు పార్టీ ఎజెండా కంటే పర్సనల్ ఎజెండాకే ప్రాముఖ్యమిస్తారనే విమర్శ ఎంతో కాలం నుంచి ఉంది. అందుకూ చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరుతున్నాయంటూ చాన్నాళ్ళ క్రితమే ఆందోళన మొదలైంది. ఒక వర్గ నాయకులు పథకం ప్రకారం టీ. కాంగ్రెస్ను నిర్వీర్యం చేయడం కోసం పనిచేస్తున్నారని, అందుకే కాంగ్రెస్ (Tcongress) గురించి తెలియనివారికి, కాంగ్రెస్ లక్షణాలు లేనివారికి, నిన్నా..మొన్నా వచ్చిన వారికి కీలక పదవులు అప్పగిస్తున్నారని..సీనియర్లకు కనీసం సమాచారం ఇవ్వకుండా కమిటీలు వేశారని మండిపడుతున్నారు. కొండా సురేఖ వంటి సీనియర్ నేతలు తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించారని ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే కొండా సురేఖ తనకిచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవికి రాజీనామా సమర్పించారు.

ఓరుగల్లులో కొండాతో మొదలైన అసంతృప్త జ్వాలలు..ఖమ్మం మీదుగా..నల్గొండ నుంచి మెదక్ జిల్లా ద్వారా గాంధీభవన్కు వ్యాపించాయి. జిల్లా కమిటీలు వేసేటపుడు సంబంధిత జిల్లాలోని సీనియర్లకు చెప్పే పనిలేదా అంటూ భట్టి విక్రమార్క నిలదీసారు. పార్టీలో పీసీసీకి ఉన్నంత విలువ సీఎల్పీకి కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. కొత్త కమిటీల్లో సీనియర్లకు ఘోర పరాభవం జరిగిందని మొత్తం మీద కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఏ స్థాయిలోనూ సీనియర్లను లెక్కలోకి తీసుకోలేదని హైకమాండ్ను, పీసీసీ చీఫ్ను దుమ్మెత్తి పోస్తున్నారు. సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ (Congress)లో కోవర్టిజం రాజ్యమేలుతోందని ఆరోపించారు. పార్టీలోని కొందరు అధికార పార్టీ కోసం పనిచేస్తూ..కాంగ్రెస్ను సర్వ నాశనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు రోజులుగా సీనియర్లంతా జట్లు, జట్లుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమకు, తమవారికి జరిగిన అన్యాయం గురించి ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. కోవర్టులను కాపాడేందుకే కొత్త కమిటీలు వేశారని, వారికే ప్రాధాన్యమిచ్చారని విమర్శిస్తున్నారు. పార్టీలోని కోవర్టుల గురించి హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీలో అనర్హులను అందలం ఎక్కిస్తున్నారని అందుకే రోజు రోజుకూ కాంగ్రెస్ పతనం అవుతోందనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు అసంతృప్త నాయకులు. టీ.పీసీసీ (Tpcc)లో తలెత్తిన ఈ అసంతృప్త జ్వాలలు, ఆగ్రహ జ్వాలల్ని హైకమాండ్ ఎలా అదుపులోనికి తెస్తుందో చూడాలి.

Also Read: Suguna Sundari Song: సుగుణ సుందరితో బాలయ్య మాస్ డ్యూయెట్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Controversial
  • Konda Surekha
  • revanth reddy
  • TCongress

Related News

Minister Konda Surekha and Seethakka meets KCR

మహిళా మంత్రులకు కేసీఆర్‌ ఆత్మీయ పలకరింపు..పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం

మంత్రులు నివాసానికి చేరుకోగానే కేసీఆర్ వారిని చిరునవ్వుతో పలకరిస్తూ “బాగున్నారా అమ్మా” అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. మంత్రుల రాక సందర్భంగా కేసీఆర్ సంప్రదాయ పద్ధతిలో వారికి గౌరవం ఇచ్చారు. పసుపు, కుంకుమ, చీరలు, తాంబూలాలతో వారిని మర్యాదపూర్వకంగా సత్కరించారు.

  • Erravalli Farmhouse Seethakka, Konda Surekha,

    కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

Latest News

  • వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

  • జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

  • జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్‌!

  • ఉక్రెయిన్ పై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

  • రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలివే..!

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd