Vivek Venkataswamy : బీజేపీకి వివేక్ రాజీనామా..కాసేపట్లో రాహుల్ తో భేటీ
మాజీ MP వివేక్ వెంకటస్వామి బిజెపి పార్టీ కి రాజీనామా చేసారు. పార్టీ మేనిఫెస్టో కమిటీతో పాటు బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు అధికారిక ప్రకటన చేసారు.
- Author : Sudheer
Date : 01-11-2023 - 12:08 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి పార్టీ (BJP) కి భారీ షాక్ తగిలింది. మాజీ MP వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) బిజెపి పార్టీ కి రాజీనామా చేసారు. పార్టీ మేనిఫెస్టో కమిటీతో పాటు బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు అధికారిక ప్రకటన చేసారు. ఈమేరకు రిజైన్ లెటర్ ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)కి పంపించారు. ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ (Congress) తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాసేపట్లో వివేక్ వెంకట స్వామి నోవా టెల్ హోటల్ కు వెళ్లి రాహుల్ గాంధీ తో భేటీ కాబోతున్నారు.
భారమైన హృదయంతో నేను రాజీనామా చేస్తున్నాను..ఇంతకాలం పార్టీలో తనకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు అని చెబుతూ లేఖలో ప్రస్తావించారు. అయితే కొద్దిరోజుల క్రితమే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వివేక్ వెంకటస్వామితో భేటీ అయ్యారు. వివేక్ని కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వనించారు. అయితే వివేక్ వెంకటస్వామితో పాటు ఆయన కుమారుడు వంశీకి కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు రెడీ ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
వివేక్ తన తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి 2009లో పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్ బొగ్గు మరియు ఉక్కు కమిటీల సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 2 జూన్ 2013న కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ (TRS) పార్టీలో చేరాడు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014 మార్చి 31న తిరిగి కాంగ్రెస్లో చేరాడు. ఆయన 2014లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత 2016లో టీఆర్ఎస్ లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితుడయ్యాడు.
2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి 25 మార్చి 2019న రాజీనామా చేసి బిజెపి లో చేరారు. అప్పటి నుండి నేటి వరకు బీజేపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఇక ఇప్పుడు సొంత గూటికి చేరబోతున్నారు.
Read Also : Congress Candidates : కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం.. బిఆర్ఎస్ కు కలిసొస్తుందా..?