Free Bus : ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం గొడవ.. దారుణంగా కొట్టుకున్న మహిళలు
- By Sudheer Published Date - 01:28 PM, Mon - 1 January 24

కాంగ్రెస్ ప్రభుత్వం (Cong Govt) తీసుకొచ్చిన మహిళ ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం..కొట్లాటలకు దారిస్తుంది. సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ప్రతి రోజు పలు చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
సాధారణంగా బస్సు, రైళ్లలో మనం చాలా సార్లు చూసి ఉంటాం. సీట్ల కోసం గొడవలు పడటం.. ఒకరిని మరొకరు తోసుకోవడం…ఇక ఇప్పుడు తెలంగాణ లో ఫ్రీ బస్సు సౌకర్యం వచ్చిన దగ్గరి నుండి ఆర్టీసీ బస్సుల్లో మాటల యుద్ధాలు కాదు జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్న ఘటనలు ఎక్కువుతున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకొంటూ… అడ్డొచ్చినవారిని కూడా వదలడం లేదు. కొన్నిసార్లు ఆ గొడవలు చేతులు దాటి ..రోడ్ ఫై కొట్టుకునే స్థాయికి చేరుతున్నాయి. తాజాగా జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో అదే జరిగింది. సీటు విషయంలో తలెత్తిన గొడవ..చివరకు కొట్టుకునే స్థాయి కి వెళ్ళింది. ఇరు మహిళలు జుట్లు పట్టుకొని..కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఏమాత్రం ఆపకుండా అలాగే కొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
ఫ్రీ బస్ ఎఫెక్ట్!!
జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం గొడవ.. దారుణంగా కొట్టుకున్న మహిళలు. pic.twitter.com/ah7wceH6vl
— Telugu Scribe (@TeluguScribe) January 1, 2024
Read Also : Sharmilas Son Wedding : వైఎస్ షర్మిల కొడుకు పెళ్లిపై కీలక అప్డేట్