Amit Shah Vs KTR : అమిత్ షాతో కేటీఆర్ ‘ఢీ’
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ట్విట్టర్ వేదికగా మంత్రి కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయం హింది బాష అంటూ ఆయన చేసిన ట్వీట్ పై కేసీఆర్ తనదైనశైలిలో రీ ట్వీట్ చేశారు.''భిన్నత్వంలో ఏకత్వమే మన బలం డియర్ అమిత్ షా జీ .
- By Hashtag U Published Date - 03:30 PM, Sat - 9 April 22
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ట్విట్టర్ వేదికగా మంత్రి కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయం హింది బాష అంటూ ఆయన చేసిన ట్వీట్ పై కేసీఆర్ తనదైనశైలిలో రీ ట్వీట్ చేశారు.”భిన్నత్వంలో ఏకత్వమే మన బలం డియర్ అమిత్ షా జీ . భారత్ అంటే రాష్ట్రాల సమాఖ్య (యూనియన్ ఆఫ్ స్టేట్స్), నిజమైన వసుధైక కుటుంబం. ఇంత గొప్పదైన మన దేశంలో తాము ఏం తినాలో, ఏ దుస్తులు ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాష మాట్లాడాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదు? భాషపర ఆధిపత్యం వల్ల దేశం తిరోగమనం చెందే ప్రమాదం ఉంది.
Unity in diversity is our strength dear @AmitShah Ji. India is a union of states & a true ‘Vasudhaika Kutumbam’
Why don’t we let people of our great nation decide what to eat, what to wear, who to pray to and what language to speak!
Language chauvinism/hegemony will boomerang pic.twitter.com/AwMae3Clra
— KTR (@KTRTRS) April 9, 2022
తాను మొదట భారతీయుడిని, తర్వాతే తెలుగువాడిని, తెలంగాణ పౌరుడిని. నా మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, కొద్దిగా ఉర్దూలోనూ మాట్లాడగలుగుతాను. అయితే, మీరు హిందీని మాత్రమే మాట్లాడాలని అంటూ ఇంగ్లిష్ భాషను ఇలాగే అగౌరవపర్చితే దాని పరిణామాల ప్రపంచంలో రాణించాలనుకుంటున్న దేశ యువతకు నష్టం కలుగుతుంది” అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
అంతేకాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు. దేశంలో పెరిగిపోతోన్న పెట్రోలు, డీజిల్ ధరల గురించి వచ్చిన పలు కథనాలను ఆయన ప్రస్తావించారు. ”ఎట్టకేలకు ప్రధాని మోదీజీ నేతృత్వంలో భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరింది. కొనుగోలు శక్తి తుల్యత (పీపీపీ) గణాంకాల ద్వారా వేసిన అంచనాల ప్రకారం… దేశంలో ఎల్పీజీ గ్యాసు సిలిండర్ ధర ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. ప్రపంచంలో పెట్రోలు ధరలు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రపంచంలో డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఎనిమిదవ స్థానంలో ఉంది’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Related News
Amit Shah : రాహుల్ గాంధీకి 5 ప్రశ్నలు సంధించిన అమిత్ షా
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని తన కుటుంబ కోట అయిన రాయ్బరేలీలో కార్నర్ చేయడానికి స్పష్టమైన ప్రయత్నంలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఆయన ముందు ఐదు ప్రశ్నలు సంధించారు