TRS Plenary : టీఆర్ఎస్ ప్లీనరీకి అంతా సిద్ధం.. అందరూ ఆ రంగు బట్టలే ధరించాలని షరతు!
గులాబీ పండుగకు అంతా సిద్ధమైంది. 21 ఏళ్ల వార్షికోత్సవాన్ని ఘనంగా చేసుకోవడానికి టీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి
- By Hashtag U Published Date - 11:01 AM, Tue - 26 April 22
గులాబీ పండుగకు అంతా సిద్ధమైంది. 21 ఏళ్ల వార్షికోత్సవాన్ని ఘనంగా చేసుకోవడానికి టీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పైగా 2023 ఎన్నికలకు ముందు పార్టీ ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడే మార్గాలను వెదుక్కుంటోంది. దీనికి ప్రశాంత్ కిషోర్ సహాయాన్ని కూడా గులాబీ బాస్ తీసుకుంటున్నారు. ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన పోటీ కూడా ఉంది. ఇలాంటి సమయంలో జరుగుతున్న ప్లీనరీ కావడంతో.. ఇందులో పార్టీ అధినేత కేసీఆర్.. తన కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారా అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది.
కిందటి ఏడాది అక్టోబర్ లోనే ద్విదశాబ్ది వార్షికోత్సవ ప్లీనరీ జరిగింది. మళ్లీ ఆరు నెలల వ్యవధిలోనే మరో ప్లీనరీని టీఆర్ఎస్ నిర్వహిస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ఉత్సాహంగా, అంకితభావంతో పార్టీ పనిచేసేలా ఇది బూస్ట్ ఇస్తుందని అధిష్టానం భావిస్తోంది. ఇందులో మంత్రులతోపాటు పార్లమెంటులో ఉభయసభల సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు మొత్తం మూడు వేల మందిని ఆహ్వానించారు. అందరూ గులాబీ రంగు బట్టలే ధరించాలని ఈసారి కండీషన్ పెట్టింది.
టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానాలను తీసిపారేయలేం. వీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మొత్తం 11 తీర్మానాలను ప్రవేశపెట్టేలా ప్లాన్ చేసింది పార్టీ హైకమాండ్. వీటిలో మూడు రాజకీయ తీర్మానాలు ఉంటాయి. అవి కూడా కేంద్ర ప్రభుత్వం వివక్షతోపాటు దేశాన్ని పరిపాలించడంలో కేంద్రం వైఫల్యం, జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక.. లేకపోతే కొత్త పార్టీ పెట్టడంపై ఈ తీర్మానాలు ఉండే అవకాశం ఉంది. వీటితోపాటు ఉద్యోగ నియామకాలు, అభివృద్ధి, దళితబంధు, సంక్షేమం, టీఆర్ఎస్ సాధించిన విజయాలపైన తీర్మానాలు ఉంటాయి.
2023 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ ఈ ప్లీనరీ ద్వారా తన శ్రేణులకు దిశానిర్దేశం చేస్తుంది. ముచ్చటగా మూడోసారి పవర్ లోకి రావాలంటే.. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలపై ప్రజలకు వివరంగా చెప్పాలని సూచిస్తోంది. ఇంకా ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్ ను బట్టి కేసీఆర్ తయారుచేసుకున్న స్కెచ్ లను కూడా ప్లీనరీ రోజు నుంచే అమలు చేసేలా కసరత్తు పూర్తయినట్టు సమాచారం.
Related News
BRS : బీజేపీ ప్రత్యామ్నాయంపై నార్త్-సౌత్,KCR అయోమయం!
బీజేపీ ప్రత్యామ్నాయం(BRS) మూలనపడుతోంది. ఏప్రిల్ 27న పార్టీలను ఒకే