Fly Drone: రూ.12లకే ఆకాశంలో ప్రయాణం.. త్వరలో హైదరాబాద్ లో 4 సీట్ల డ్రోన్లు
ఫ్లైట్ ఎక్కాలంటే వేలల్లో ఖర్చుపెట్టాలి. అది సామాన్యులకు, మధ్యతరగతి వారికి కష్టం.
- By Hashtag U Published Date - 12:02 PM, Fri - 25 March 22
ఫ్లైట్ ఎక్కాలంటే వేలల్లో ఖర్చుపెట్టాలి. అది సామాన్యులకు, మధ్యతరగతి వారికి కష్టం. పోనీ హెలికాప్టర్ లో ప్రయాణమైనా అనుకుంటే.. అది కూడా ఖరీదైనదే. అలాంటిది రూ.12లకే ఆకాశంలో ప్రయాణించవచ్చు.
అని ఎవరైనా చెబితే ఎలా ఉంటుంది? వావ్.. సూపర్ అంటారు. ప్రైవేట్ జెట్ విమాన సర్వీసులను అందించే జెట్ సెట్ గో.. దీని కోసం ప్లాన్ చేస్తోంది. సిటీలోనే ఆకాశంలో తక్కువ ఖర్చుతో డ్రోన్లలో ప్రయాణించడం వల్ల వేగంగా, సురక్షితంగా, తక్కువ ఖర్చులో గమ్యస్థానం చేరుకోవచ్చంటోందీ ఈ సంస్థ.
ఒక భారీ డ్రోన్ లో నలుగురు పట్టేలా సీటింగ్ అరెంజ్ మెంట్ ఉంటుంది. వీటిని ఒకసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అంటే ఒకరికి కిలోమీటరుకు రూ.12 ఖర్చు అవుతుంది. వీటినే ఈవీ టోల్స్ సేవలు అంటారు. ఇప్పటికే ఇలాంటి డ్రోన్లను ఎయిర్ బస్ తో పాటు మరికొన్ని సంస్థలు తయారుచేస్తున్నాయి. వీలైనంతవరకు హైదరాబాద్ లోనే ఈరకమైన సేవలు ముందుగా అందుబాటులోకి వచ్చే ఛాన్సుంది.
ఇప్పుడు సిటీలో ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణమంటే చాలా కష్టం. ట్రాఫిక్ తోపాటు ప్రతీదానికి సొంత వాహనాలను బయటకు తీయలేని పరిస్థితి. అందులోనూ కిలోమీటరు ప్రయాణానికి వాటిలో అయ్యే ఖర్చు కూడా తక్కువేమీ కాదు. అందుకే కార్లు, ఇతర వాహనాలతో పోలిస్తే.. కాస్త లగ్జరీతో, వేగంగా వెళ్లాలనుకుంటేవారికి ఇలాంటి ఈవీ టోల్స్ బాగా పనికొస్తాయి.
ఈమధ్యకాలంలో ప్రైవేట్ జెట్లకు గిరాకీ బాగా పెరిగింది. హైదరాబాద్ సంగతే చూస్తే.. రోజూ 15 ప్రైవేటు జెట్లు లేదా హెలికాప్టర్లు ల్యాండ్ అవుతున్నాయంటే సీన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఇలాంటి ప్రైవేటు ల్యాండింగ్స్ దాదాపు 250 ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఇలాంటి సేవలకు గిరాకీ పెరిగింది కాబట్టి.. రోజూ 500 ప్రైవేటు ల్యాండింగ్స్ నమోదయ్యే ఛాన్సుంది. పైగా ప్రైవేటు జెట్ సేవల సెక్టార్ లో దేశంలో ఎక్కువగా హైదరాబాద్ నుంచే గ్రోత్ కనిపిస్తోంది. అందుకే ఈవీ టోల్స్ కు డిమాండ్ పెరిగే ఛాన్సుంది.
Related News
TTD: తిరుమలలో భద్రతా లోపం, డ్రోన్ ఎగురవేసిన భక్తులు
తిరుమల ఆలయం సమీపంలో భద్రతా లోపంలో నిబంధనలను ఉల్లంఘించి కొండ ఆలయాన్ని చిత్రీకరించడానికి ఇద్దరు భక్తులు డ్రోన్ను ఉపయోగించారు. అస్సాంకు చెందిన భక్తులు ఆలయ దృశ్యాలను తీయడానికి డ్రోన్ను ఎగురవేయడాన్ని గుర్తించారు. 53వ వంక వద్ద ఘాట్ రోడ్డులో డ్రోన్ను ఎగురవేస్తుండగా ఆ దారిన వెళ్తున్న మరికొందరు భక్తులు భక్తుల చిత్రాలను తీశారు. డ్రోన్ను స్వాధీనం చేసుకున్న టిటిడి సీరియ�