Telangana DSC : ఈ వారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్.. 11 వేల ఖాళీలు ?
Telangana DSC : ఈవారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు తెలంగాణ సర్కారు రెడీ అవుతోందని తెలుస్తోంది.
- By Pasha Published Date - 01:56 PM, Tue - 27 February 24
Telangana DSC : ఈవారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు తెలంగాణ సర్కారు రెడీ అవుతోందని తెలుస్తోంది. డీఎస్సీ ద్వారా దాదాపు 11,060 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డీఎస్సీకి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్ధం చేసి సీఎం కార్యాలయానికి పంపిందని అంటున్నారు. అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,059 పోస్టులలో డీఎస్సీని విడుదల చేసింది. వాటిలో స్కూల్ అసిస్టెంట్ 1739, పండిట్ పోస్టులు 611, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 164, ఎస్జీటీ పోస్టులు 2,575 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష తేదీలను ప్రకటించారు. అయితే ఎన్నికల కారణంగా అది వాయిదా పడింది. ఆ సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు గత నోటిఫికేషన్ ను రద్దు చేసి, 11 వేల టీచర్ పోస్టులతో నాలుగైదు రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్(Telangana DSC) విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ నోటిఫికేషన్లోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం స్పెషల్ టీచర్లను కూడా రిక్రూట్ చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
డీఎస్సీ నిర్వహణపై సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ప్రకటన చేశారు. మెగా డీఎస్సీ ద్వారా టీచరు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో ఇబ్బందులపై దృష్టిసారించాలని ఆయన సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు లేరనే సాకుతో మూసేసిన బడులను మళ్లీ తెరిపించాలని రేవంత్ నిర్దేశించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నా.. బడి నడవాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో బడి ఉండాల్సిందేనని అన్నారు. బడి లేని కారణంగా విద్యార్థులు చదువులకు దూరం కావొద్దని, చదువుల కోసం వేరు గ్రామాలు, పట్టణాలకు పోయే పరిస్థితులు ఉండొద్దని పేర్కొన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read : AI – Fetus : ‘ఏఐ’తో డెలివరీ డేట్ మరింత పక్కాగా.. ‘గర్భిణీ-జీఏ2’ రెడీ
గ్రూప్-1 సైతం..
హైకోర్టు తీర్పును అనుసరించి గత గ్రూప్-1 నోటిఫికేషన్ను రద్దు చేసి, పెంచిన పోస్టులతో కొత్త నోటిషికేషన్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసింది. తెలంగాణలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9వ తేదీన నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇటీవలే 563 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ రిలీజ్ కాగా.. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసి.. దానికి అదనంగా మరిన్ని పోస్టులను చేర్చి కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల.. ప్రిలిమ్స్ రాత పరీక్ష కోసం ఈ నెల 23 నుంచి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇప్పటికే అభ్యుర్థులు పెద్ద ఎత్తున గ్రూప్-1 పరీక్షలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు
Also Read : Drug Party : టాలీవుడ్ నిర్మాత, హీరోయిన్ చెల్లి, మాజీ సీఎం మనవడు.. రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్టులు
Related News
Movie Theaters: ఈనెల 17 నుంచి తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్..!
తెలంగాణ రాష్ట్రంలోని సినీ ప్రియులకు షాక్ తగలనుంది.