HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Wants People First Politics Not Family First Modi Attacks Trs

Modi Warns KCR: కేసీఆర్ పై మోడీ అటాక్.. అవినీతి, కుటుంబ పాలన అంటూ వ్యాఖ్యలు!

తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘యుద్ధం’ చేస్తున్నందున తనకు ఎంతో స్ఫూర్తినిచ్చారని ప్రధాని

  • Author : Hashtag U Date : 12-11-2022 - 4:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pm Modi
Pm Modi

తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘యుద్ధం’ చేస్తున్నందున తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్నారు. ‘‘తెలంగాణ పేరు చెప్పుకున్నవాళ్లు ధనవంతులు అయ్యారని, కానీ రాష్ట్రం మాత్రం వెనక్కు వెళ్లిపోయింది. అధికార పార్టీ నాయకులు అన్యాయానికి పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రజలు అధికార పార్టీని నమ్మితే.. ఆ పార్టీ ప్రజలను మోసం చేసింది అని సీఎం కేసీఆర్ ప్రస్తావించకుండా మోడీ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. అధికార టీఆర్‌ఎస్‌ను గద్దె దించి అధికారంలోకి రావాలనే తపనతో బీజేపీ ఉందని మోడీ అన్నారు.

ఎప్పుడైతే అన్నిటినీ చీకటి ఆక్రమిస్తుందో, అందులో నుంచి కమలం బయటపడుతుందని మోదీ అన్నారు. తెలంగాణలోనూ ఇదే జరుగబోతుందని మోడీ అన్నారు. ఇటీవల మునుగోడు ఉపఎన్నికపై ప్రధాని మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు మొత్తం అసెంబ్లీనే మునుగోడుకు తీసుకొచ్చేలా చేశారని రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. “పెద్ద నాయకులను మోకాళ్లపై నిలబడేలా చేశారని, తెలంగాణ ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారని మోడీ పేర్కొన్నారు. తెలంగాణలో ‘సూర్యోదయం’ ఎంతో దూరంలో లేదని, రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలన్నీ అందుకు నిదర్శనమని,  “తెలంగాణ మే హర్ తరఫ్ కమల్ కిలేగా” అని మోడీ నొక్కి చెప్పారు.

Also Read:  Congress: ఢిల్లీలో కాంగ్రెస్ `టాస్క్ ఫోర్స్`, కోమ‌టిరెడ్డిపై తేల్చుడే.!

“రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో మూఢనమ్మకాలను ప్రేరేపిస్తుందో దేశం మొత్తం తెలుసుకోవాలి. తెలంగాణ ప్రగతి సాధించాలంటే మూఢనమ్మకాలను దూరం చేయాలి’’ అని కేసీఆర్ సెంటిమెంట్ పై మోడీ పంచులు వేశారు. రాష్ట్రానికి ‘కుటుంబం, రాజకీయాల కంటే ‘ప్రజలే ముఖ్యమని’ ప్రధాని కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. న్యాయం నుంచి తప్పించుకునేందుకు అవినీతి శక్తులు ఏకమవుతున్నాయని, తెలంగాణ ప్రజలకు అవగాహన ఉందని ప్రధాని అన్నారు. రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తలు ప్రజలకు చేరువ కావాలని, కేంద్రం పథకాలు అందరికీ చేరేలా చూడాలని పిలుపునిచ్చారు. “ఇతరులు నన్ను దుర్భాషలాడితే బాధపడకండి. ఆ మాటలను తేలిగ్గా తీసుకుని ఒక కప్పు టీ తాగు” అని మోడీ సలహా  ఇచ్చాడు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్లు నిర్మించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నదని ఆరోపించారు. ‘‘ఈ పథకం కింద పేదల కోసం దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లను పంపిణీ చేశాం. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్నితొలగించింది. టీఆర్‌ఎస్‌ 2బీహెచ్‌కే హామీని నెరవేర్చలేదు, కేంద్రం ఇళ్లు పంపిణీ చేయనివ్వలేదు. నేడు తెలంగాణ ప్రగతిని కోరుకుంటోంది. బీజేపీ మాత్రమే దానిని అందించగలదని అన్నారు. తెలంగాణలోని రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చిన మోదీ, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

Also Read:  Revanth Letter to Modi: ప్రధాని మోడీకి ‘రేవంత్’ లేఖాస్త్రం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP Telangana
  • cm kcr
  • hyderabad
  • pm modi

Related News

Water Woes in Hyderabad Demand for Water Tankers Rises

హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

హైదరాబాద్‌లో సమ్మర్ ప్రభావంతో నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. కొద్ది రోజులుగా నీళ్ల ట్యాంకర్ల కోసం బుకింగ్‌లు పెరిగాయి. నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరగడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటి వేళల్లో గృహ అవసరాల కోసం ట్యాంకర్లు పంపిస్తున్నారు. రాత్రి వేళల్లో కమర్షియల్ అవసరాల కోసం ట్యాంకర్లు సరఫరా చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కొద్ది రోజులుగా ట్

  • H-1B visa delays: Amazon offers temporary relief to Indian employees

    Amazon : తెలుగు రాష్ట్రాల్లో అమేజాన్ బజార్ సరికొత్త రికార్డు

  • PM Modi

    PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?

  • Modi Urges No Gold Purchase

    Pm Modi: బంగారం కొనడం ఆపేయండి.. ప్రధాని మోదీ విజ్ఞప్తి…

  • International Thalassemia Day

    Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

Latest News

  • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd