KTR on Twitter: ఆదానీ, మోడీ స్కామ్ పై మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ మీద సంచలన ట్వీట్ చేశారు.
- By CS Rao Published Date - 04:30 PM, Thu - 16 June 22
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ మీద సంచలన ట్వీట్ చేశారు. శ్రీలంక కేంద్రంగా మోడీ, అదానీ `పవర్` డీల్ పై ఆరోపణలు చేశారు. పవన విద్యుత్ కాంట్రాక్టు విషయంలో మోడీ జోక్యం చేసుకుని సహకరించారని కేటీఆర్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. శ్రీలంకలో 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంట్ ను ఎలాంటి పోటీ లేకుండానే అదానీ దక్కించుకున్నారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్ కు కట్టబెట్టాలని శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై భారత ప్రధాని మోదీ ఒత్తిడి తీసుకొచ్చారని ఆ దేశ విద్యుత్తు సంస్థ అధ్యక్షుడిగా పని చేసిన ఎంఎంసీ ఫెర్డినాండో ఇటీవల వెల్లడించారు. ఈ అంశం శ్రీలంకలో పెను దుమారమే లేపింది. అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా అక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
The chairman of Sri Lanka’s state-owned Ceylon Electricity Board accused Modi of pressuring Sri Lankan govt over the allotment of a wind power project to the Adani group.
But our business press hardly carried this news. Godi-fication of pink press is totalhttps://t.co/rdLzOiguqf— Prashant Bhushan (@pbhushan1) June 16, 2022
ఆ క్రమంలో మోదీ, గౌతమ్ అదానీలను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మన దేశంలో ప్రతిపక్ష నేతలను ఈడీ, సీబీఐ, ఐటీ టార్గెట్ చేయడం సాధారణ విషయమేనని, అయితే విద్యుత్ కాంట్రాక్ట్ లపై శ్రీలంక అధికారులు మోదీని టార్గెట్ చేశారని చెప్పారు. అయినప్పటికీ మోదీ కానీ, అదానీ కానీ ఎందుకు స్పందించలేదని మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా నిలదీశారు.
Related News
KTR: బీఆర్ఎస్ను అంతం చేసేందుకు భారీ కుట్ర
బీఆర్ఎస్ను తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించుకున్నారని కేటీఆర్ అన్నారు. ఈ రోజు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్