HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Minister Harish Rao Hard Comments On Bjp Govt

Harish Rao: ఏం ఇచ్చారు.. ఏం చేశారు..? బీజేపీపై హరీశ్ రావు ఫైర్!

తెలంగాణ ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇవాళ నారాయణ్ పేట జిల్లాలో పర్యటించారు.

  • Author : Balu J Date : 06-06-2022 - 3:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hareesh
Hareesh

తెలంగాణ ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇవాళ నారాయణ్ పేట జిల్లాలో పర్యటించారు. పలు డెవలప్ మెంట్ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. రూ. 56 కోట్లతో 390 పడకల ఆసుపత్రి, రు. 1.25 కోట్లతో టి డయాగ్నొస్టిక్ నిర్మాణాలకు శంకుస్ధాపన, రూ. 5.98 కోట్లతో ఎర్రగుట్ట నుండి ఎక్లాస్ మీదుగా తెలంగాణ – కర్ణాటక సరిహద్దు వరకు నిర్మించిన 5.5 కిలోమీటర్ల రోడ్డును, డయాలసిస్ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ జిల్లాలో 390 పడకల ఆసుపత్రి ఏర్పాటు కోసం శంకుస్ధాపన చేసుకోవడం శుభదినమని, కేసీఆర్ వల్లే ఇదంతా సాధ్యమైందని ఆయన అన్నారు.

నాగం జనార్ధన్ రెడ్డి, డీకే అరుణ లాంటివాళ్లు గతంలో మంత్రులుగా ఉన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ముందుకురాలేదు. కానీ ప్రస్తుతం ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ లోనే మొత్తం 4 మెడికల్ కాలేజీల ఏర్పాటు జరుగుతున్నదని ఆయన గుర్తు చేశారు. 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు 3 కాలేజీలు ఏర్పాటు చేస్తే, సీఎం కేసీఆర్ గారు 7 ఏళ్ళలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. నారాయణ్ పేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకానుందని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదలకు డయాలసిస్ సేవలు అందేలా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఉచితంగా 57 రకాల పరీక్షలు చేసే టి డయాగ్నొస్టిక్ సెంటర్ ని ప్రారంభించామని అన్నారు. ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, టు డి ఏకో సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని హరీశ్ రావు అన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో 24 గంటల కరెంట్ రైతులకు అందుబాటులో ఉందని, బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యకావడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. 57 ఏళ్లకే పింఛన్లు ఇచ్చే కార్యక్రమం మొదలు అవుతుందని కొత్తగా 10 లక్షల పింఛన్లు ఇవ్వబోతున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. మన వడ్లను కేంద్రం కొనలేదు. బండి సంజయ్ ఏం ముఖం పెట్టుకొని పాద యాత్ర చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.  ప్రధాని ఏం ముఖం పెట్టుకొని వస్తారు? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ వంటి విభజన హామీలు ఎందుకు ఇవ్వరు? అని మంత్రి హరీశ్ రావు బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central govt
  • hard comments
  • harish rao
  • palamuru

Related News

Harish Rao Pm

రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం

గత ఏడాది అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వచ్చి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించినా, ఏడాది గడిచినా ఒక్క పైసా విదల్చలేదని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 1100 కోట్ల బోనస్ నిధులు, పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు

  • Harish Rao Movie Tickets

    మరో భారీ స్కామ్ ను బయటపెట్టి, కాంగ్రెస్ సర్కార్ కు షాక్ ఇచ్చిన హరీష్ రావు

  • Budget 2026 Updates

    కేంద్ర బడ్జెట్ పైనే ఏపీ ఆశలు

  • Phone Tapping Santhosh

    ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

  • India-European Union agreement: 40 percent tariffs on luxury cars..!

    భారత్–యూరోపియన్ యూనియన్ ఒప్పందం: లగ్జరీ కార్లపై 40 శాతానికి టారిఫ్‌లు..!

Latest News

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

  • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

  • భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

  • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

  • నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd