T Hub: టీ హబ్ 2.0 ప్రారంభించిన సీఎం కేసీఆర్.. దేశానికే రోల్ మోడల్ అని వ్యాఖ్య
- By Hashtag U Published Date - 10:22 PM, Tue - 28 June 22
ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ ‘టీ–హబ్’ రెండో దశను సీఎం కె.చంద్రశేఖర్రావు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జి హబ్ లో ప్రారంభించారు. ప్రపంచానికి యువ భారత్ సామర్థ్యాన్ని తెలుపాలనే సంకల్పంతో టీ హబ్ ప్రారంభించినట్లు కేసీఆర్ తెలిపారు. టీ హబ్ నేషనల్ రోల్ మోడల్ అన్నారు. తెలంగాణ స్టార్టప్ పాలసీ స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. టీ హబ్ స్థాపించాలనే ఆలోచనకు 8 సంవత్సరాల క్రితమే అంకురార్పణ జరిగిందన్నారు. రూ.400 కోట్లతో 3.62 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఒకే సమయంలో ఏకంగా 4వేలకుపైగా స్టార్టప్లు కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుండటం.
ఎందుకు నిర్మించారు ?
2015లో గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ–హబ్ మొదటి దశ నిర్మించారు. దానికి
అనూహ్య స్పందన లభించింది. దీంతో మరింత భారీగా టీ–హబ్ రెండో దశ (టీ–హబ్ 2.0)ను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు. ఇది తొలిదశ టీ–హబ్ తో పోలిస్తే ఐదు రెట్లు పెద్ద టెక్ ఇంక్యుబేటర్. టీ–హబ్ మొదటిదశలో ప్రాథమిక స్థాయి వసతులే అందుబాటులో ఉండగా.. తాజాగా రెండో దశలో అత్యాధునిక వసతులను కూడా జోడించారు.
‘శాండ్ విచ్’ నమూనాలో డిజైన్..
‘స్పేసెస్’ అనే కొరియన్ సంస్థ టీ–హబ్ రెండో దశ భవనాన్ని అత్యంత సృజనాత్మకంగా ‘శాండ్ విచ్’ నమూనాలో డిజైన్ చేసింది. పది అంతస్తుల్లో టీ–హబ్ రెండో దశ నిర్మాణం కాగా.. ప్రస్తుతం ఐదు అంతస్తుల్లో కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఈ ఏడాది చివరలోగా అదనంగా నెలకో అంతస్తు చొప్పున వినియోగంలోకి తేనున్నారు. ఇందులో కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకునే వెంచర్ క్యాపిటలిస్టులు, స్టార్టప్లు, ఇతర సంస్థలను ప్రత్యేక నిపుణుల బృందం ఎంపిక చేస్తుంది. స్టార్టప్ సంస్కృతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు రాబోయే రోజుల్లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్లో టీ–హబ్ రీజినల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఎవరెవరికి అవకాశం ?
* వ్యక్తిగతంగా లేదా ఒక చిన్న బృందంగా ఏర్పడి సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చే వారికి.. వారి ఆలోచన వాణిజ్య రూపం పొందేందుకు అవసరమైన అన్ని హంగులు టీ–హబ్ 2లో అందుబాటులో ఉంటాయి.
* ఇతర ఇంక్యుబేటర్లతో పోలిస్తే తక్కువ అద్దెకు ఆఫీస్ స్పేస్ లభిస్తుంది.
* టీ–హబ్ మొదటి అంతస్తును వెంచర్ క్యాపిటలిస్టుల ఆఫీసుల కోసం పూర్తి ఉచితంగా కేటాయిస్తారు.ఇప్పటివరకు రెండు వీసీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి.
ఇందులోకి తరలించేవి..
* ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ను ఇక్కడికి తరలిస్తారు.
* ‘సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’, హైదరాబాద్లో సీఐఐ ఏర్పాటు చేయనున్న ‘సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్’కు కార్యాలయ వసతి కల్పిస్తారు.
* కేంద్ర ప్రభుత్వ ‘స్టార్టప్ ఇండియా’ స్టేట్ సెంటర్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన ‘అటల్ ఇన్నోవేషన్ సెంటర్’ కూడా ఇక్కడే ఏర్పాటవుతాయి.
* ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని టీ–హబ్ మొదటి దశకు చెందిన 215 స్టార్టప్లను వెంటనే కొత్త ప్రాంగణంలోకి తరలిస్తారు.
CM Sri KCR inaugurated @THubHyd Phase 2 facility in Hyderabad today. Minister Sri @KTRTRS, CS Sri @SomeshKumarIAS, Principal Secretary Sri @Jayesh_Ranjan, T-Hub Board of Directors and dignitaries from innovation ecosystem were present. #InnovateWithTHub #HappeningHyderabad pic.twitter.com/PTMrRjcQHZ
— Telangana CMO (@TelanganaCMO) June 28, 2022
Related News
KTR : లోక్ సభ ఎన్నికల తర్వాత వాళ్లిద్దరూ కనిపించారు..కేటీఆర్
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మల్కాజిగిరి (Malkajigiri) పార్లమెంట్ పరిధిలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్(Etala Rajender), సునీతా మహేందర్ రెడ్డి( Sunita Mahender Reddy) కనిపించరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసే ఉంటే.. కవితన�