KCR Congratulates Nikhat: నిఖత్ జరీన్ కు కేసీఆర్ అభినందనలు
బార్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్ను
- By Balu J Published Date - 12:02 PM, Mon - 8 August 22
బార్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందించారు. జరీన్తో ఫోన్లో మాట్లాడి మెచ్చుకున్నాడు. స్వర్ణ పతకం సాధించడం ద్వారా నిఖత్ యావత్ భారతదేశం గర్వపడేలా చేసింది. జరీన్ విజయం తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా మరోసారి ప్రశంసలు తెచ్చిపెట్టిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తూనే ఉంటుందని సీఎం పునరుద్ఘాటించారు.
స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్ను శాసనమండలి సభ్యురాలు కె.కవిత కూడా అభినందించారు. నిఖత్ జరీన్ మరోసారి రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టడం గర్వించదగ్గ విషయమని ఆమె అన్నారు. ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన దాదాపు మూడు నెలల తర్వాత జరీన్ కామన్వెల్త్ స్వర్ణాన్ని గెలుచుకుంది. 26 ఏళ్ల నిఖత్ ఈ ఘనతను సాధించింది.
CM Sri K. Chandrashekar Rao has congratulated Boxer @nikhat_zareen for clinching Gold Medal in the Women's 50 kg category at @birminghamcg22. Hon'ble CM called Ms. Zareen over phone and lauded her winning streak.
(File Photo) pic.twitter.com/cntQcn6Ltb
— Telangana CMO (@TelanganaCMO) August 7, 2022
Related News
Hanuman: భాగ్యనగరంలో మార్మోగిన హనుమాన్ నామస్మరణ, పాల్గొన్ననేతలు
Hanuman: హనుమాన్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మోండా మార్కెట్ పెరుమాళ్ వెంకటేశ్వర దేవాలయం వద్ద శివాజీ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక హాజరయ్యారు. ఈటెల రాజేందర్ భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం పార్టీలో చేరిన కోనే�