Telangana BJP : వెనుకంజలో బీజేపీ హేమాహేమీలు
Telangana BJP : బీజేపీ నేత ఈటల రాజేందర్కు ఎదురుగాలి వీస్తోంది.
- By Pasha Published Date - 11:05 AM, Sun - 3 December 23
Telangana BJP : బీజేపీ నేత ఈటల రాజేందర్కు ఎదురుగాలి వీస్తోంది. గజ్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు చోట్ల కూడా ఓట్ల లెక్కింపులో ఆయన వెనుకంజలో ఉన్నారు. గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో సీఎం కేసీఆర్ రెండో రౌండ్ ముగిసే సరికి స్వల్ప మెజార్టీ సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలుస్తుండటంతో బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటలకు ఆధిక్యం దక్కే ఛాన్స్ లేకుండాపోయింది. మరోవైపు హుజురాబాద్లోనూ ఈటల రాజేందర్పై బీఆర్ఎస్ అభ్యర్ధి కౌశిక్ రెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ స్థానంలో కేసీఆర్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి లీడ్లో ఉన్నారు. మరోవైపు దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా వెనుకబడిపోయారు. దుబ్బాకలో రఘునంద్ రావుపై కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కరీంనగర్లో బండి సంజయ్పై బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో (Telangana BJP) కొనసాగుతున్నారు.
Also Read: KCR – Third Place : కామారెడ్డిలో మూడోస్థానంలో కేసీఆర్.. ముందంజలో రేవంత్
Tags
Related News
Raghunandan Rao : గల్లీలో.. ఢిల్లీలో లేని.. కారును గెలిపిస్తే మిగిలేది శూన్యమే: రఘునందన్ రావు
Raghunandan Rao:మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ జరిగిన కిసాన్ మోర్చా(kisan morcha) సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, రెవంత్రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని ఆయన అన్నారు. We’re now