HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Bjp Chief Continues Firing Salvos On Cm Kcr

Telangana BJP: కల్వకుంట్ల పాలనను భూస్థాపితం చేస్తాం – ‘బండి సంజయ్’

తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల పాలనను భూస్థాపితం చేసే వరకు బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

  • Author : Hashtag U Date : 11-03-2022 - 11:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandi Sanjay
Bandi Sanjay

తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల పాలనను భూస్థాపితం చేసే వరకు బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కేసీఆర్ అవినీతి-నియంత-కుటుంబ పాలనను అంతం చేసి ప్రజాస్వామిక తెలంగాణ సాధించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. ఇందుకోసం బీజేపీ సాగిస్తున్న మహోద్యమానికి మద్దతివ్వాలని ప్రజలను కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను పార్టీ సీనియర్ నేతలు, నాయకులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు సాయంత్రం జరిగిన ‘ఆశీర్వచన’ కార్యక్రమానికి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

రాష్ట్రంలోని వివిధ ఆలయాల నుండి వచ్చిన వేద పండితులు, పూజారులు వేద మంత్రోచ్చారణాలతో ఆశ్వీరదించారు. మెట్ పల్లి స్వామిజీ ప్రణవానంద, వేములవాడ రాజన్న ఆలయ పూజారులు బండి సంజయ్ కు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. డాక్టర్ కె.లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి, రఘునందన్ తదితరులు పుష్పగుచ్చం, శాలువాతో సంజయ్ ను సత్కరించారు. బండి సంజయ్ తో ఫొటోలు దిగేందుకు నాయకులు, కార్యకర్తలు పోటీ పట్టారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ సారథ్యంలో రెండేళ్ల కాలంలో చేపట్టిన పార్టీ కార్యక్రమాలను, సాధించిన విజయాలను వివరించారు.
అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ జీ(సంస్థాగత) లకు ప్రత్యేక క్రుతజ్ఝతలు తెలిపారు బండి సంజయ్. ఇంత గొప్ప పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉంది. ప్రధాని మోదీ స్పూర్తితో ముందుకు సాగుతున్నాం.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ నెర్చవేర్చకుండా జిమ్మిక్కులు చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగిపోయారు. వారికి భరోసా కల్పించేందుకు, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ ఈ రెండేళ్ల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టంది. రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగుల కోసం ఉద్యమాలు చేశాం. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాం. ఇందుకోసం నాతో సహా అనేక మంది జైలుకు వెళ్లిన సంగతిని గుర్తుంచుకోవాలని చెప్పుకొచ్చారు బండి సంజయ్.
ప్రజల కోసం నమ్మిన సిద్ధాంతం కోసం కార్యకర్తలు తెగించి కొట్లాడుతున్నారు. అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. జైళ్లకు వెళ్లారు. అయినా వెనుకాడకుండా పోరాడుతున్న కార్యకర్తలకు శిరసు వంచి నమస్కరిస్తున్నా అన్నారు బండి సంజయ్. ప్రజా ఆకాంక్షలను నెరవేర్చేందుకు, ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం బీజేపీ పోరాడుతోంది. అధికారానికి దగ్గరగా వచ్చాం. ఏ ఎన్నిక వచ్చినా బీజేపీ కైవసం చేసుకుని సత్తా చూపుతోంది. ఎంత డబ్బు వెదజల్లినా, అధికార కుట్రలు చేసినా, మరెన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని కోరుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చే సమయంలో కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొడుతూ బీజేపీని, కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారు.

టీఆర్ఎస్ డౌన్ ఫాల్ క్లైమాక్స్ కు చేరింది. అందుకే కేంద్రాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా డబ్బులిచ్చి స్ట్రాటజీ టీం లను పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు బీజేపీవైపే ఉన్నారు. అందుకే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తొలి దశ ప్రజా సంగ్రామ యాత్ర చేశాం. ఏప్రిల్ 14 నుండి రెండో దశ పాదయాత్రను ప్రారంభించబోతున్నాం. కల్వకుంట్ల పాలనను భూస్థాపితం చేస్తాం. ప్రజాస్వామిక తెలంగాణ సాధిస్తాం. బెంగాల్ తరహా రాజకీయాలు చేసినా, తాలిబన్, రజాకార్ల పాలన చేసినా ఎదిరించి పోరాడేందుకు మేం సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు బండి సంజయ్.
కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం. కమలం పువ్వును నిరంతరం వికసింపజేస్తాం. ఈ మహోద్యమంలో వెన్నంటి ఉన్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు బండి సంజయ్.
ఇక అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు బీజేపీ చీఫ్ చెప్పుకొచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP vs TRS
  • Sanjay Bandi
  • telangana bjp state president
  • Telangana CM KCR

Related News

    Latest News

    • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

    • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

    • 2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!

    Trending News

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd