Bhatti Vikramarka: భట్టితో ‘తెలుగు తమ్ముళ్లు’.. పొత్తుకు సంకేతమేనా?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికల్లో ఇప్పట్లో లేనప్పటికీ ఆసక్తికర సంఘటనలు వెలుగుచూస్తున్నాయి.
- By Balu J Published Date - 01:23 PM, Thu - 14 April 22
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికల్లో ఇప్పట్లో లేనప్పటికీ ఆసక్తికర సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తెలంగాణ రైతాంగ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా సీఎల్సీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మధిర నియోజకవర్గంలో ప్రతి ఊరు, ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. దీంతో భట్టి పాదయాత్రకు మంచి స్పందన వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో భట్టి పాదయాత్రలో తెలుగు తమ్ముళ్లు (టీడీపీ కార్యకర్తలు) కనిపించడం, భట్టి పచ్చ జెండా కండువాను కప్పుకోవడం, సీపీఎం కార్యకర్తలు సైతం భట్టి అడుగుల్లో అడుగు వేయడం చర్చనీయాంశమవుతోంది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటికీ తెలంగాణలోని ఖమ్మం జిల్లాపై టీడీపీకి ఇప్పటికీ మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో భట్టి తెలుగు తమ్ముళ్లను కలుపుకొని పోవడం, ఆ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు కూడా సంఘీభావం ప్రకటించడం వచ్చే ఎన్నికలకు పొత్తుకు సంకేతంగా భావించవచ్చని పలువురు భావిస్తున్నారు. ఇక సీపీఎం కూడా మద్దతు తెల్పడంతో మహా కూటమి తెరపైకి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని అంటున్నారు. అయితే మధిరపై భట్టికి పట్టు ఉండటంతో టీడీపీ ఓటు చీలిపోకుండా, కాంగ్రెస్ కు లబ్ధి చేకూరులా వ్యవహరిస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
భట్టి గట్టి పట్టు
కేవలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల తోనే కాకుండా ప్రత్యర్థి పార్టీలలోని నాయకులను సైతం ఆకర్షించడం భట్టి విక్రమార్క మధిర మీద ఉన్న పట్టును నిరూపిస్తోంది. సహజంగా మూడు సార్లు శాసనసభ్యుడుగా ఎన్నికైన వ్యక్తి మీద ఎంతో కొంత వ్యతిరేకత రావడం సహజం. అలాంటిది మధిర నియోజకవర్గంలో ఉన్న టీడీపీ, సీపీఎం, కమ్యూనిస్టు పార్టీలు, కుల సంఘాలు సైతం భట్టి పాదయాత్రకు బ్రహ్మరథం పట్టడం చూస్తే మధిర నియోజకవర్గం మీద భట్టి ముద్ర స్పష్టం అయ్యిందని వాపోతున్నారు. భట్టి లాంటి ఫిగర్ ప్రత్యర్థి పార్టీ కి అంజనం వేసి వెతికినా దొరకడు అనేది నిజం. ఇది టీఆర్ఎస్ కు సైతం మింగుడు పడటం లేదు. ఏదేమైనప్పటికీ భట్టి యాత్ర మాత్రం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోందని కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆ సీన్ రిపీట్ అవుతుందా?
టీడీపీ కార్యకర్తలతో పాటు కమ్యూనిస్టు నేతలు సైతం భట్టికి సంఘీభావం తెల్పడంతో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అయితే గతంలో మహాకూటమిగా ఏర్పడ్డ టీడీపీ 2014 లో తెలంగాణలో ఎన్నికలకు వెళ్లింది. అయితే విషయాన్ని కేసీఆర్ ప్రభుత్వానికి ప్లస్ గా మారింది. మళ్లీ చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టబోతున్నాడనీ.. మహాకూటమిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చాడు. దీంతో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. మళ్లీ భట్టి విక్రమార్కతో తెలుగు తమ్ముళ్లు సంఘీభావం తెల్పడంతో … ఈ విషయం కూడా అధికార పార్టీ కి ప్లస్ గా మారబోతుంది అని పలు పార్టీలు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తుందా? లేదా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందా? అనేది వేచి చూడాల్సిందే..
Related News
Minister Ponnam: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి పొన్నం
Minister Ponnam: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. అక్కన్నపేటలో పార్టీ కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేసిందన్నారు. ఆరోగ్య బీమా పథకం కింద పేదలు రూ.10 ల