Kumari Aunty : కుమారి ఆంటీ హోటల్ వద్ద నిరుద్యోగుల నిరసన…
- By Sudheer Published Date - 09:49 PM, Sat - 3 February 24
‘రేయ్.. ఎవర్రా మీరంతా’..ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు కుమారి ఆంటీ కూడా తన హోటల్ వద్దకు వస్తున్న మీడియా ను ఉద్దేశించి ఇలాగే అంటుంది. మొన్నటి వరకు హ్యాపీగా వ్యాపారం చేసుకున్న కుమారి ఆంటీ..ఇప్పుడు సోషల్ మీడియా దెబ్బకు మూసుకొని పరిస్థితి కి వచ్చింది. ప్రతి రోజు వందలమంది యూట్యూబుర్లు వచ్చి ఇంటర్వ్యూ లు అని , కవరేజ్ అని నానా రభస చేస్తున్నారు. వీరి దెబ్బకు రెండు రోజుల క్రితం ట్రాఫిక్ పోలీసులు హోటల్ మూయించారు. సీఎం రేవంత్ జోక్యం చేసుకొని హోటల్ ను పర్మిషన్ ఇచ్చారు. అలాగే ఒకరోజు హోటల్ కు నేను వస్తానని చెప్పడం తో ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
రేవంత్ వస్తాడని చెప్పడం తో ఇప్పుడు నిరుద్యోగులంతా కుమారి ఎంట్రీ కి క్యూ కట్టారు. కుమారి ఆంటీ భోజనం తినడానికి కాదు..సీఎం రేవంత్ కు జీవో 46 రద్దు చేయమని చెప్పాలంటూ వారంతా కుమారి ఆంటీ వద్దకు వచ్చి తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. వందల మంది ఈరోజు హోటల్ వద్దకు వచ్చి ఏకంగా నిరసన తెలుపడం తో కుమారి షాక్ లో పడింది. అసలు ఏంజరుగుతుందో ఆమెకు ఏమి అర్ధం కావడంలేదు..’రేయ్.. ఎవర్రా మీరంతా’ అనడం తప్ప మరోటి లేకుండా పోయింది. మీ బాధను నేను ఎలా చెప్పగలను అంటూ ఆమె చెప్పుకుంటూ వచ్చినప్పటికీ అక్కడికి వచ్చిన వారు ఎవ్వరు ఆమె మాట వినడం లేదు. ఇదెక్కడి లొల్లి రా అనుకుంటూ ఆమె బాధపడుతుంది. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన వారంతా ‘ఇకనుండి ఎవరికి ఏ సమస్య వున్న ప్రజాదర్బార్ బదులు కుమారి ఆంటీ స్టాల్ దగ్గరికి వెళ్ళండి ముఖ్యమంత్రి తొందరగా మీ సమస్య పరిష్కారిస్తాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అసలు జీవో నంబర్ 46 ఎందుకు రద్దు చేయమంటున్నారంటే.. ఇది 9 శాఖలకు సంబంధించినదైనా.. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు ఉద్యోగాల భర్తీ చుట్టే కేంద్రీకృతమైంది. రెవెన్యూ జిల్లాల జనాభాను ప్రాతిపదికగా చేసుకొని టీఎస్ఎస్పీ పోస్టుల్ని కేటాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతోందనేది రాష్ట్రంలోని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. కటాఫ్ మార్కుల్లో వ్యత్యాసం కారణంగా రాజధాని ప్రాంతానికే ఎక్కువ ఉద్యోగాలు దక్కుతాయని చెబుతున్నారు. టీఎస్ఎస్పీ పోస్టులు రాష్ట్రస్థాయివి కావడంతో కటాఫ్ మార్కులను సైతం రాష్ట్రస్థాయిలోనే పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. టీఎస్ఎస్పీ నియామకాల్లో జీవో నంబరు 46ను మినహాయించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద నిరుద్యోగుల నిరసన!
రేవంత్ రెడ్డి మీ ఫుడ్ స్టాల్ వద్దకు వస్తాను అన్నారు కదా జీవో 46 రద్దు చేయమని ఆయనతో చెప్పండి అంటూ నిరుద్యోగుల నిరసన.#KumariAunty #RevanthReddy pic.twitter.com/kH6zcgCic9
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2024
Read Also : AP : చంద్రబాబు అండ్ కో ఫై యుద్దానికి నేను సిద్ధం..మీరు సిద్ధమా..? – జగన్
Related News
AP Politics : గుడివాడలో కుమారి ఆంటీ ప్రచారం.. పిఠాపురంలో నిర్మాత ఎస్కెఎన్..
రీసెంట్ సోషల్ మీడియా సెన్సేషన్ కుమారి ఆంటీ కూడా ప్రచారంలోకి ఎంట్రీ ఇచ్చేసారు. కుమారి ఆంటీ స్వస్థలం గుడివాడ అని అందరికి తెలిసిందే.