Sircilla: అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీర, మోడీ చేతులమీదుగా శ్రీరాముడికి!
- By Balu J Published Date - 02:29 PM, Fri - 19 January 24
Sircilla: సిరిసిల్లకు చెందిన నేత హరి ప్రసాద్ వద్ద బంగారు చీరను తయారు చేశాడు. జనవరి 26 న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో శ్రీరాముడికి సమర్పించబడుతుంది. బంగారు, వెండి గీతల్లో శ్రీరాముడి చిత్రాలతో నేసిన చీర ఎనిమిది గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో తయారు చేయబడింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ దేవితో కలిసి హరి ప్రసాద్ ఇంటికి వెళ్లి శ్రీరాముడి జీవితంలోని డిజైన్ ఫీచర్లతో కూడిన చీరను చూశారు.
ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సిరిసిల్లలో అద్భుతమైన చేనేత కళాకారులు ఉన్నారని.. గతంలో అగ్గిపెట్టేలో పట్టే చీరను తయారుచేసిన చరిత్ర సిరిసిల్ల జిల్లాకు ఉందని గుర్తు చేశారు. ఇంతటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ చీరను 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో రూపొందించారు. రామాయణ ఇతివృత్తం తెలియజేసే చిత్రాలతో ఈ చీరను చేనేత కళాకారుడు హరిప్రసాద్ తయారు చేశారు.
శ్రీరాముడి జన్మస్థలంలో రామమందిరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల తాకిడి పెరుగుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. ఆలయ ప్రతిష్టాపన జరిగాక అయోధ్యకు రద్దీ పెరగనున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట రైల్వేస్టేషన్ల నుంచి అయోధ్య స్టేషన్కు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనున్నారు. సికింద్రాబాద్ – అయోధ్య ప్రత్యేక రైళ్లను జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. విజయవాడ నుంచి బయల్దేరే అయోధ్య రైళ్లు.. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
Related News
Ayodhya Ram Temple: మూడు నెలల్లో అయోధ్య రామయ్యను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా..?
జనవరి 22, 2024న రామజన్మభూమి అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.