HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Serial Deaths Of Telugu Students In America Two Youth Drowned In Waterfall

Telugu Students : విహార యాత్రలో విషాదం.. అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

Telugu Students :  అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు  మృత్యువాత పడ్డారు.

  • Author : Pasha Date : 12-05-2024 - 12:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Two Telugu Students Died In America
Two Telugu Students Died In America

Telugu Students :  అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు  మృత్యువాత పడ్డారు. అరిజోనా యూనివర్సిటీలో చదువుతున్న లక్కిరెడ్డి రాకేశ్‌రెడ్డి (23), రోహిత్‌ మణికంఠ రేపాల (25) ప్రసిద్ధ ఫాజిల్‌ క్రీక్‌ జలపాతంలో మే 8వ తేదీన మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ వారం క్రితమే ఎంఎస్ కోర్సును పూర్తి చేసి డిగ్రీ పట్టాలు అందుకున్నారు. ఈసందర్బంగా 16 మంది స్నేహితులతో కలిసి ఈ నెల 8న టూర్ కోసం జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ సరదాగా గడుపుతుండగా రాకేశ్‌, రోహిత్‌లు ప్రమాదవశాత్తూ జలపాతంలో మునిగిపోయారు.గజ ఈత గాళ్లతో గాలించగా 25 అడుగుల లోతులో ఇద్దరి మృతదేహాలు దొరికాయి.

We’re now on WhatsApp. Click to Join

లక్కిరెడ్డి రాకేశ్‌రెడ్డి ఖమ్మం నగరానికి చెందిన మాంటిస్సోరి, తెలంగాణ నారాయణ పాఠశాలల అధినేతల్లో ఒకరైన లక్కిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పద్మ దంపతుల ఏకైక కుమారుడు. లక్కిరెడ్డి రాకేశ్‌రెడ్డి కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సును ఇండియాలోనే పూర్తి చేశాడు. అనంతరం ప్రముఖ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. అయినా అందులో చేరకుండా ఎంఎస్ కోర్సు చేసేందుకు అమెరికాకు వెళ్లాడు. ఎంఎస్ కోర్సు పట్టా పుచ్చుకొని భారత్‌కు తిరిగి రావాల్సిన రాకేశ్‌రెడ్డి .. విగత జీవిగా తిరిగి వస్తుండటంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకటి రెండు రోజుల్లో లక్కిరెడ్డి రాకేశ్‌రెడ్డి  మృతదేహం ఖమ్మంకు చేరుతుందని తెలుస్తోంది. గత తొమ్మిదేళ్ల కాలంలో ఫాజిల్‌ క్రీక్‌ జలపాతంలో మునిగి తొమ్మిది మంది చనిపోయారు.

Also Read :POK Clashes : అట్టుడుకుతున్న పీఓకే.. పోలీసు అధికారి మృతి, 90 మందికి గాయాలు

ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనూ  ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడి తెలుగు విద్యార్థులు జితేంద్రనాథ్‌ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్కాంట్లాండ్ లో జరిగింది. ఈ ఇద్దరు విద్యార్థులు కూడా బ్రిటన్‌లోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా,  మరొకరు ఏపీకి చెందిన విద్యార్థి.  స్కాట్లాండ్‌లోని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్న వీరిద్దరూ మరో ఇద్దరితో కలిసి పెర్త్‌షైర్‌లోని లిన్‌ ఆఫ్‌ తమ్మెల్‌కి వెళ్లారు. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తుండగా, ప్రమాదవశాత్తుగా వీరిద్దరూ జారి నీటిలో పడి కొట్టుకుపోయారు.

Also Read :Laptop Side Effects: ల్యాప్‌టాప్‌ను తెగ వాడేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రాబ్ల‌మ్స్ రావొచ్చు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • Serial Deaths
  • telugu students
  • us
  • Waterfall

Related News

New Jersey

చిన్నారులపై లైంగిక దాడి..అమెరికాలో భారతీయ యువకుడి అరెస్ట్!

New Jersey  అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలో అడుగుపెట్టడమే కాకుండా అక్కడ పసిపిల్లలపై పైశాచికత్వం ప్రదర్శించిన ఓ భారతీయుడి ఉదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. న్యూజెర్సీలో 13 ఏళ్ల లోపు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓడెల యశస్వీ కొత్తపల్లి అనే యువకుడిని అధికారులు కటకటాల్లోకి నెట్టారు. అంతేకాకుండా జైలుకు పంపడమే కాకుండా తిరిగి భారత్‌కు బహిష్కరించేందుకు చట్టపరమైన చర్యలు

  • Got India's commitment to stop buying Russian oil

    రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్‌ హామీ..అమెరికా కామెంట్లు

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd