Amit Shah Security Lapse : కేంద్ర హోంమంత్రి షా పర్యటనలో భద్రతాలోపం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది.
- By CS Rao Published Date - 01:02 PM, Sat - 17 September 22
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొని, బేగంపేటలోని హరిత ప్లాజాకు అమిత్ షా తిరిగి వచ్చారు. ఆ సమయంలో కాన్వాయ్ను బ్రెజ్జా కారు అడ్డుకోవడంతో అప్రమత్తమైన భద్రతా అధికారులు ఆ వాహనం వెనుక అద్దాన్ని పగులగొట్టారు. కాన్వాయ్ కు అడ్డొచ్చిన కారు కొత్త గా ఉంది. టెంపరరీ రిజిస్ట్రేషన్ స్టిక్కర్ వేసి ఉంది.భద్రతా అధికారులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ట్రాఫిక్ పోలీసులపై కూడా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు సెప్టెంబర్ 4, 5 తేదీల్లో అమిత్ షా ముంబై పర్యటనలో భద్రతా లోపం బయటపడింది. వైసీపీ ఎంపీ పీఏగా షా కాన్వాయ్ లో ఇటీవల ఒక వ్యక్తి చొరబడ్డారు. ఇటీవల షా కాన్వాయ్ కు భద్రతాలోపం కనిపిస్తోంది.
Related News
PoK – INDIA : పీఓకే మనదే.. 24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్.. అమిత్షా ప్రకటన
PoK - INDIA : పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భారత్లో భాగమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.