Final Journey: ముగిసిన మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు.. కన్నీటి వీడ్కోలు పలికిన నేతలు
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు పూర్తైయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.
- By Hashtag U Published Date - 04:19 PM, Sun - 5 December 21
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు పూర్తైయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. రోశయ్య అంత్యక్రియలకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరైయ్యారు. రోశయ్యను కడసారి చూసేందుకు భారీగా ప్రజలు,అభిమానులు తరలివచ్చారు. రోశయ్య శనివారం ఉదయం మరణించారు. ఉదయం ఆయనకు అస్వస్థగా ఉండటంతో వెంటనే బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.
My Tribute to Great Congress Man Telugu pride Konijeti Rosaiah Garu in Gandhi bhavan today 🙏🙏
🔸On behalf of Aicc leader of opposition Rajya Sabha @kharge ji paid his tribute.@RahulGandhi @priyankagandhi @manickamtagore @revanth_anumula #rip #RosaiahRIP #Rosaiah #Congress pic.twitter.com/PpM0CJDpXJ— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) December 5, 2021
రోశయ్య పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచారు. అనంతరం గాంధీభవన్ కి తీసుకువచ్చారు. గాంధీభవన్ లో ఏఐసీసీ నేత మల్లిఖార్జున ఖర్గే, టీపీసీసీ నేతలు, కార్యకర్తలు ఆయన భౌతికకాయానికి నివాళ్లు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి దేవరయాంజల్లోని వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. రోశయ్య మృతిపై తెలంగాణ , ఏపీ ప్రభుత్వాలు మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించించాయి.
On behalf of AICC @INCIndia & Hon'ble Congress President Smt #SoniaGandhi and our leader @RahulGandhi ji @LoPIndia Shri @kharge ji pays his last respects to Ex Governor of Tamilnadu,Ex CM & PCC President of AP Shri #Rosaiah garu at Gandhi Bhavan in Hyd.#RosaiahRIP pic.twitter.com/79ofZ4kDNB
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) December 5, 2021
Related News
AP Politics : మసకబారిన `మాజీ సీఎం` రాజకీయ కిరణాలు
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో (AP Politics) ఆయన చేసిన