Revenue Department: రెవెన్యూలో అవినీతి పరాకాష్ట!
అవినీతి నిరోధక శాఖ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో అవినీతి శాఖలో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో నిలవగా,
- By Balu J Published Date - 02:52 PM, Mon - 27 June 22
అవినీతి నిరోధక శాఖ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో అవినీతి శాఖలో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో నిలవగా, పోలీసు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో గత ఏడాది కాలంలో మూడు శాఖల అధికారులపై 150 కేసులు నమోదయ్యాయి. రెవెన్యూ శాఖ అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారుల స్థాయి నుంచి గ్రామ రెవెన్యూ అధికారుల వరకు అధికారిక పనుల నిమిత్తం లంచాలు తీసుకుంటూ అక్రమ ఆస్తులు కూడబెట్టినందుకు కేసులు నమోదయ్యాయి.
ఏసీబీలో నమోదైన కేసుల్లో రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాల జారీ, భూ సర్వే సమస్యలు, రెవెన్యూ సర్టిఫికెట్ల మంజూరుకు లంచాలు కోరడం లాంటివి కామన్ గా మారాయి. ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం, అనుమానితులను బెయిల్పై విడుదల చేయడం, దర్యాప్తులో జాప్యం చేయడం, నిందితులను స్కాట్గా విడిచిపెట్టడం కోసం లంచాలు తీసుకున్న అవినీతి చర్యలకు సంబంధించి 10 మంది పోలీసు ఇన్స్పెక్టర్లు, సబ్-ఇన్స్పెక్టర్లు సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందిలో 40 శాతం మంది ప్రజాసేవలకు డబ్బులు డిమాండ్ చేసినట్లు ఈ ఏడాది ప్రారంభంలో ఓ ఎన్జీవో నిర్వహించిన సర్వేలో తేలింది. 92 శాతం మంది రెవెన్యూ, పోలీసు అధికారులు బహిరంగంగా లంచాలు డిమాండ్ చేసినట్లు చెప్పారు.
Tags
Related News
Chandrababu: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ..అన్ని జిల్లాల ఎస్పీలకు లేఖ కాపీలు
Chandrababu Letter: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(Andhra Pradesh Assembly Elections) నోటిఫికేషన్ వెలువడనున్న వేళ తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు(Chandrababu) రాష్ట్ర డీజీపీ(DGP)కి లేఖ(Letter) రాశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని అందులో కోరారు. ఎన్నికల నామినేషన్ పక్రియలో అభ్యర్థి తనపై ఉన్న కేసుల వివరాలు పేర్కొనాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా క�