Yadagiri Gutta : యాదగిరిగుట్టలో బంగారు గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్
Yadagiri Gutta : రేవంత్ రెడ్డి దంపతులు స్వయంగా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని, ఆలయ అభివృద్ధికి తమ మద్దతును వ్యక్తం చేశారు
- Author : Sudheer
Date : 23-02-2025 - 12:43 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయం (Gold-Plated Yadadri temple ) పునరుద్ధరణ తర్వాత మరింత వైభవాన్ని సంతరించుకుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth)ఆలయానికి చేరుకుని స్వర్ణ విమాన గోపురాన్ని (Gopuram) ఆవిష్కరించారు. మహా కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడుతున్నాయి. రేవంత్ రెడ్డి దంపతులు స్వయంగా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని, ఆలయ అభివృద్ధికి తమ మద్దతును వ్యక్తం చేశారు. బంగారు గోపురం ఆవిష్కరణతో యాదగిరిగుట్ట మరింత భక్తుల ఆకర్షణగా మారింది.
YV Subba Reddy : ప్రతిపక్షనేత హోదాపై వైఎస్ జగన్ పోరాటం.. వైవీ సుబ్బారెడ్డి స్పందన
యాదాద్రి ఆలయంలో అత్యంత ఆకర్షణీయమైన స్వర్ణ విమాన గోపురం నిర్మాణం భక్తుల మనసులను దోచుకుంటోంది. 50.5 అడుగుల ఎత్తుతో, 68 కిలోల బంగారంతో తాపడం చేసిన ఈ గోపురం, దాదాపు 10,759 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. తాపడం పనులు 2024 డిసెంబర్ 1న ప్రారంభమై, 2025 ఫిబ్రవరి 18న పూర్తయ్యాయి. ఈ పనుల ఖర్చు రూ.5.10 కోట్లు (జీఎస్టీ మినహా) కాగా, రాగి రేకుల తయారీకి రూ.12 లక్షలు ఖర్చయింది. నవయుగ మెటల్స్, ఎంఎస్ స్మార్ట్ క్రియేషన్స్ (చెన్నై) సంస్థలు కలిసి ఈ గొప్ప ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేశాయి.
Rajalingamurthy Murder Case: రాజలింగమూర్తి హత్య.. నిందితుల్లో బీఆర్ఎస్ నేత.. మర్డర్కు కారణమిదీ
యాదాద్రి ఆలయం తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా భక్తుల విశ్వాస కేంద్రంగా నిలుస్తోంది. ముఖ్యంగా స్వర్ణ విమాన గోపురం నిర్మాణంతో ఆలయ మహిమ మరింతగా పెరిగింది. ప్రాచీన శిల్పకళకు ఆధునిక సాంకేతికతను జోడించి నిర్మించిన ఈ గోపురం, భక్తులకు కొత్త ఆకర్షణగా మారింది. భక్తులు పెద్దఎత్తున ఆలయాన్ని సందర్శించేందుకు తరలివస్తున్నారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల పెంపుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.