Revanth Reddy: నేను తిన్న చిప్పకూడు సాక్షిగా.. కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తా!!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి మునుగోడు నియోజకవర్గంలో పర్యటించారు.
- By Balu J Published Date - 10:09 PM, Fri - 23 September 22
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి మునుగోడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మునుగోడు ఓటర్లనుద్దేశించి మాట్లాడారు. దేశంలోనే మొట్టమొదటి గురుకుల పాఠశాలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రేవంత్ గుర్తుకు తెచ్చారు. దేశంలో కాంగ్రెస్ పై బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో నన్ను అడ్డు తొలగించుకోవడానికి కేసీఆర్ నాపై 120 కేసులు పెట్టాడని రేవంత్ అన్నారు.
నేను దొంగతనం చేసి జైలుకు పోలే.. పేదల పక్షాన కొట్లాడి జైలుకెళ్లానని, నేను జైలుకెళ్లానని గర్వాంగా చెబుతున్నా అని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కోసం ఒక్కసారి కాదు… పేదల కోసం 100 సార్లు జైలుకెళ్లడానికి తాను సిద్ధమని రేవంత్ అన్నారు.
నేను తిన్న చిప్పకూడు సాక్షిగా చెబుతున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని అన్నారు. మునుగోడు గ్రామాలకు సరైన రోడ్లు వేయని వారు.. ఇక్కడ అభివృద్ధి చేస్తారా అని రేవంత్ బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలను ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన మాకే మునుగోడు ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందిని, పేదల నేస్తం కాంగ్రెస్ ను గెలిపించండి అని రేవంత్ అన్నారు. ఒకప్పుడు నేను టీడీపీ అయి ఉండొచ్చునని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిని అని, మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరేస్తా రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
దివాన కేసిఆర్, మునుగోడు నియోజకవర్గంల ఒక్క రోడ్డేసినవా.. pic.twitter.com/9Oxo1qsna7
— Revanth Sainyam Telangana (@Revanth_Sainyam) September 23, 2022
Related News
Harish Vs Revanth : హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం – రేవంత్ రెడ్డి
మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తు వస్తుందంటూ రేవంత్ సెటైర్ వేశారు