Telangana : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీలతో..కేసీఆర్ కు చలి జ్వరం – రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే, కొడుకేమో పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నాడు
- By Sudheer Published Date - 06:57 PM, Sat - 30 September 23
తెలంగాణ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార (BRS) – ప్రతిపక్ష పార్టీల (Congress & BJP) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు..కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ గా పెట్టుకున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ ను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ 6 గ్యారెంటీ పధకాలు ప్రకటించిందో..ప్రజల్లో కాంగ్రెస్ గాలి వీస్తుంది. దీంతో అధికార పార్టీ కాంగ్రెస్ ఫై విమర్శలు , సెటైర్లు వేస్తూ వస్తుంది.
రీసెంట్ గా బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ (KTR) ..తెలంగాణ కాంగ్రెస్ కు ఎన్నికల నిధులు సమకూర్చేందుకు కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరులోని బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు రూ.500 చొప్పున వసూలు చేస్తోందని, పాత అలవాట్లు చచ్చినా వదలవని, స్కాంలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ ఘనచరిత్ర గురించి అందరికీ తెలిసిందేనని, అందుకే కాంగ్రెస్ ను ‘స్కాం’గ్రెస్ అంటున్నానని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కేటీఆర్ కామెంట్స్ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే, కొడుకేమో పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నాడు. నిండా అవినీతిలో మునిగిపోయి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది? అని మండిపడ్డారు. పక్కరాష్ట్రంపై నీ గాలి మాటలు కాసేపు పక్కనబెట్టి, తెలంగాణలో మీ కల్వకుంట్ల SCAMILY గురించి చెప్పు అంటూ వ్యాఖ్యానించారు.
“దళితబంధులో 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నట్టు స్వయంగా మీ అయ్యనే ఒప్పుకున్న సంగతి చెప్పు. లిక్కర్ స్కాంలో మీ చెల్లి రూ.300 కోట్లు వెనకేసుకుందని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు. భూములు, మద్యం అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడవడంలేదని కాగ్ కడిగేసిన విషయం చెప్పు.
Read Also : Rajinikanth : జైలర్ హుకుం సాంగ్.. బ్యాక్ స్టోరీ ఇదే..!
తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నారో, ఎన్ని ఎకరాలను మీ రియల్ ఎస్టేల్ మాఫియాకు కట్టబెట్టారో, ఎంతమంది మీ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారో, ఎన్ని లక్షల చదరపు అడుగుల స్థలాలు మీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయో అన్నీ లెక్కలతో సహా తేలుస్తాం. కాంగ్రెస్ ను అడ్డుకోవడం నీ వల్ల కాదు, నీ అయ్య వల్ల కూడా కాదు” అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే, కొడుకేమో పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నడు.
నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది?
పక్క రాష్ట్రంపై నీ గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి,
తెలంగాణలో మీ… https://t.co/8UceqyxnLD— Revanth Reddy (@revanth_anumula) September 30, 2023
Tags
Related News
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారని, హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో వ