KCR Vs Bandi Sanjay : తెలంగాణ ‘ప్రివిలేజ్’ పాలిటిక్స్
తెలంగాణ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఢీల్లీ కేంద్రంగా మళ్ళీ రాజకీయం రాజుకుంది. కరీంనగర్లో జరిగిన బండి సంజయ్ అరెస్ట్ లోక్ సభకు చేరింది. ప్రివిలేజ్ కమిటీ ముందు అరెస్ట్ ను పెట్టాడు.
- By CS Rao Published Date - 01:56 PM, Sat - 22 January 22
తెలంగాణ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఢీల్లీ కేంద్రంగా మళ్ళీ రాజకీయం రాజుకుంది. కరీంనగర్లో జరిగిన బండి సంజయ్ అరెస్ట్ లోక్ సభకు చేరింది. ప్రివిలేజ్ కమిటీ ముందు అరెస్ట్ ను పెట్టాడు. దీంతో తెలంగాణ డీజీపీ, కరీంనగర్ ఎస్పీ, ఎఎస్పీ లకు నోటీసులు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 3వ తేదీన హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ ఆదేశించింది.
ఉద్యోగుల బదలీ కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 317 జీవో ను ఇచ్చింది.దాని కారణంగా కొందరు ఉద్యోగులు మనస్తాపం చెంది ఆత్మహత్య కు పాల్పడ్డారు. అందుకే ఆ జీవోలను వ్యతిరేకిస్తూ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు రాత్రి జాగరణ కు ఇటీవల దిగిన విషయం విదితమే. ఆ క్రమంలో కోవిడ్ నిబంధనలు ధిక్కరిచాడని బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కఠిన మైన సెక్షన్ల విధించి కోర్టుకు పెట్టారు. పరిశీలించిన కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ అరెస్ట్ ను నిరసిస్తూ బీజేపీ ఢిల్లీ పెద్దలు హైదరాబాద్ వచ్చారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా వచ్చాడు. కానీ ఆయన నిరసనకు తెలంగాణ పోలీసులు అనుమతి పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. దానిపై అప్పుడే నడ్డా మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో కాలం నిలవదని శాపం పెట్టి వెళ్ళాడు. ఆ తరువాత బండికి బెయిల్ రావటంతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ పాలన పై ఆందోళన చేశారు. ఆ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఢిల్లీ స్థాయి పోరాటం చేశారు. అందుకే ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నోటీసులతో బీజేపీ పోలీస్ సంగతి చూడాలి అనుకొంటుంది.
సాధారణంగా ఎంపీ హోదాలో ఉన్న వాళ్ళను అరెస్ట్ చేయాలి అంటే కొన్ని ప్రత్యేక నిబంధనలు పోలీసులు పాటించాలి. లోక్ సభ స్పీకర్ కు సమాచారం ఇవ్వాలి. ఒక వేళ సమావేశాలు జరుగుతుంటే స్పీకర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడానికి లేదు. పైగా ప్రజా సంబంధ అంశాలపై పోరాటం చేస్తున్నప్పుడు సీఆర్పీసీలోని కొన్ని సెక్షన్ల మాత్రమే పెట్టాలి . ఇలాంటి ప్రాధమిక అంశాలను కాదని బండిని అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై బండి సంజయ్ ఎంపీ హోదాలో ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశాడు. పరిశీలించిన కమిటీ విచారణ కోసం నోటీసులు జారీ చేసింది.సరిగ్గా ఈ నోటీసులు ఇవ్వడాన్ని బీజేపీ తన బలంగా చూస్తోంది. అంతే కాదు త్వరలో కేసీఆర్ ,కేటిఆర్ అరెస్ట్ అంటూ చాలాకాలంగా ప్రచారం చేస్తోంది. ఇటీవల కేసీఆర్ వరంగల్ పర్యటన ఆపుకోవడాన్ని కూడా అరెస్ట్ కోణం నుంచి ప్రచారం చేసింది. ఈడీ, ఐటీ తనిఖీలు ఎప్పుడైనా జరగవచ్చు అంటూ అరెస్ట్ గేమ్ ను బీజేపీ ఆడుతుంది. ఢిల్లీ పెద్దలు కూడా కేసీఆర్ అరెస్ట్ లీకులు ఇవ్వటం దుమారాన్ని రేపుతోంది. తాజాగా తెలంగాణ పోలీసు లకు నోటీసులు ఇవ్వడాన్ని కూడా బీజేపీ రాజకీయంగా అనుకూలంగా మలుచుకుంటుంది. దీనికి ధీటుగా టీఆర్ఎస్ కూడా నేరుగా మోడీని టార్గెట్ చేస్తుంది. ఫెడరల్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నాడు. ట్విట్టర్ వేదికగా మోడీ ఇమేజ్ ని తగ్గించేలా #టిలిప్రోమ్టర్ పీఎం అంటూ కెటీఆర్ ప్రచారం వేగం చేసాడు. ఇవన్నీ చూస్తుంటే మళ్లీ ఢిల్లీ వేదికగా బీజేపీ, టీఆర్ఎస్ కొత్త నాటకానికి తెరలేపబోతున్నాయని అర్థం అవుతుంది.
Related News
Bandi Sanjay: కేసీఆర్ దేశద్రోహి, మోదీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్: బండి
కరీంనగర్ ‘మహా బైక్ ర్యాలీ’లో పాల్గొన్న బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం ఉందన్నారు.