Modi and TRS: యూపీ కోసం…టీఆర్ఎస్ బాటలో మోడీ…?
దేశంలోని నదుల నీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం, రైతులకు సకాలంలో పంటలకు నీరందించడంలో బీజేపీ ప్రధాన ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.
- By Hashtag U Published Date - 10:03 AM, Sun - 12 December 21
దేశంలోని నదుల నీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం, రైతులకు సకాలంలో పంటలకు నీరందించడంలో బీజేపీ ప్రధాన ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వ్యవసాయ రంగంలో టీఆర్ఎస్ సర్కార్ సరైన పనులు చేస్తుందని పరోక్షంగా వాస్తవాలను మోడీ అంగీకరించారు.అయితే ఉత్తరప్రదేశ్లోని బల్రామ్పూర్లో రూ. 9,800 కోట్లతో సరయూ నహర్ జాతీయ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత ప్రధాన మంత్రి ప్రసంగించారు. ప్రాజెక్టు పూర్తి చేయడం సమర్థవంతమైన పనికి నిదర్శనమని మోడీ అన్నారు.సరయూ కాలువ ప్రాజెక్టులో ఐదు దశాబ్దాల్లో చేసిన దానికంటే ఐదేళ్లలోపు ఎక్కువ పని చేశామని మోదీ ప్రగల్భాలు పలికారు.మరి తెలంగాణలో కూడా ఇదే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో లేని అభివృద్ధి టీఆర్ఎస్ సర్కార్ చేస్తుంది.
ప్రధాని చేసిన ప్రకటనను బట్టి చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం లిఫ్ట ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం కేంద్రం నుండి అన్ని ప్రశంసలు, ప్రోత్సాహం, మద్దతుకు అర్హమైనది, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కూడా రాష్ట్రం నిజాయితీ ఉద్దేశాలు, సమర్థవంతమైన పనికి నిదర్శనంగా ఉంది. తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంక్లిష్టమైన ప్రాజెక్టు,మెరుగైన సామర్థ్యంతో నిర్మించబడింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నదీజలాల వినియోగం,వాటి నిల్వలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టంత ఇవ్వలేదు.దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో తెలంగాణ ప్రాంతంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు బీడుభూములుగా ఉండేవి…ఇప్పుడు ఆ భూములన్నింటికి నీరందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేసింది.
ఉత్తరప్రదేశ్ లో నదుల అభివృద్ధిపై గత ప్రభుత్వాల నిర్లక్ష్యం గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు. అయితే తెలంగాణలో కూడా 2014లో రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఏడు దశాబ్దాలలో తెలంగాణా కంటే ఏ ప్రాంతం కూడా నష్టపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం, ఏడేళ్ల వ్యవధిలో, ఆర్థిక కార్యకలాపాలు, ప్రజా సంక్షేమం లాంటి ప్రతి రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలు మాత్రమే కాకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని కూడా ఆకర్షిస్తుంది.
అయితే బీజేపీ పాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఒకలా…బీజేపీయేతర ప్రాంతాల్లో మరొకలా అనుసరిస్తుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆ రాష్ట్రానికి గతంలో జరిగిన అన్యాయాన్ని మోడీ ప్రశ్నించారు. అదే విధంగా తెలంగాణ ప్రాంతానికి కూడా జరుగుతున్న ఇక్కడి బీజేపీ నేతలు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని టీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు.
Tags
Related News
KCR Bus Yatra: రేవంత్ ఛోటా భాయ్.. మోడీ బడే భాయ్: కేసీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చోటా భాయ్, నరేంద్ర మోడీ బడే భాయ్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. రేవంత్, మోడీ ఇద్దరూ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.