Tribal Students: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో సత్తా చాటిన గిరిజన విద్యార్థులు!
గతంలో ఎన్నడు లేని విధంగా వందలోపు ర్యాంకులు సాధించి గిరిజన విద్యార్థులు వారి ప్రతిభ కనబరిచడం హర్షణీయమని మంత్రి అన్నారు.
- By Balu J Published Date - 11:08 AM, Mon - 19 June 23
నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గిరిజన విద్యార్థులు సత్తా చాటారాని రాష్ట్ర గిరిజన,స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. ఈ ఏడాది ఐఐటీ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గిరిజన విద్యార్థులు డైరెక్ట్ కేటగిరీలో 101 మంది విద్యార్థులు మరియు ప్రిపరేటరీ కేటగిరీలో 118 మంది విద్యార్థులు ఈ ఏడాది ప్రీమియర్ టెక్నలాజికల్ యూనివర్శిటీల ఐఐటీల్లో సీట్లు సాధించడం ఖాయంమన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం సొసైటీ నుండి, 350 మంది విద్యార్థులకు IIT JEE అడ్వాన్స్డ్ – 2023 క్రాకింగ్ కోసం ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వటం జరిగిందని మంత్రి తెలిపారు. వీరిలో 101మందికి ప్రత్యక్ష సీట్లు మరియు 118 ప్రిపరేటరీ ర్యాంకులు వస్తాయని పేర్కొన్నారు.. రవి కుమార్ (CRL ర్యాంక్ 16711) మరియు నిత్య శ్రీ (CRL ర్యాంక్ 18287) PVTG కమ్యూనిటీలకు చెందినవారు, ఈ సంవత్సరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని స్పష్టం మంత్రి చేశారు. 5 మంది విద్యార్ధులు ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంకింగ్ 10,000 కంటే తక్కువ ర్యాంకులు సాధించారు మరియు దాదాపు కమ్యూనిటీ ర్యాంకింగ్ లో 24 మంది విద్యార్థులు 500 కంటే తక్కువ సాధించారు.
గతంలో ఎన్నడు లేని విధంగా వందలోపు ర్యాంకులు సాధించి గిరిజన విద్యార్థులు వారి ప్రతిభ కనబరిచడం హర్షణీయమని మంత్రి అన్నారు. వీరిలో సాయిచరణ్ 30 వ ర్యాంక్ సాదించగా, వెంకటేష్ 56, బోడ ప్రవీణ్ 63, బి వేణు 75, జె అజయ్ 77 లాలూ ప్రసాద్ 97 వ ర్యాంకు సాధించాలని తెలిపారు.గిరిజన గురుకుల విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా సత్తా చాటారని మంత్రి అన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజన విద్యార్దుల సంక్షేమానికి అధిక ప్రాదాన్యతను ఇస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయనడానికి విద్యార్థులు సాధిస్తున్న ఈ ర్యాంకులే నిదర్శనం అన్నారు. ఈ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యార్థుల వలసలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
గురుకులాల్లో నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో గిరిజన విద్యార్ధులకు ఐఐటీ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటి పరీక్షలకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందిస్తున్నారని, pvtgs విద్యార్థులు సైతం ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఇంజనీరింగ్ , ఎంబీబీఎస్ విద్యలో ప్రవేశాలు పొందుతున్నారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రికార్డు స్ధాయిలో గిరిజన విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించి, సత్తాచాటాడానికి కృషి చేసిన అధికారులను సిబ్బందిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
Related News
SSC: పదో సప్లిమెంటరీ షెడ్యూల్ రిలీజ్.. వివరాలివే
SSC: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ విడుదల చేసింది. జూన్ 3 నుంచి జూన్ 13వ తేదీ వరకు తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించనున్నారు.తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ విడుదల చేసింది. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన�