Warangal : హామీలు ఇచ్చి మరచిన కాంగ్రెస్ తెలంగాణకు మేలు చేస్తుందా..? – ప్రధాని మోడీ
వరంగల్ ప్రాంతం కాకతీయుల విజయ గౌరవానికి ప్రతీక అని , 40 ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరు ఎంపీలే ఉండేవారు. అందులో ఒకరు హనుమకొండ నుంచే గెలిచారు' అని గుర్తు చేశారు
- By Sudheer Published Date - 02:33 PM, Wed - 8 May 24
లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో భాగంగా ఈరోజు ప్రధాని మోడీ (PM Modi) తెలంగాణ లో పర్యటిస్తున్నారు. ఉదయం వేములవాడ రాజన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్న ప్రధాని..అనంతరం అక్కడ ఏర్పటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ భారీ మెజార్టీ తో విజయం సాదించబోతున్నాడని.. రాష్ట్రంలో బిజెపి సత్తా చాటడం..దేశంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. అనంతరం వరంగల్ సభలో పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా వరంగల్ సభ (Warangal Meeting )లో మోడీ మాట్లాడుతూ.. వరంగల్ ప్రాంతం కాకతీయుల విజయ గౌరవానికి ప్రతీక అని , 40 ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరు ఎంపీలే ఉండేవారు. అందులో ఒకరు హనుమకొండ నుంచే గెలిచారు’ అని గుర్తు చేశారు. ఇక 3 దశల ఎన్నికల్లోనే ఎన్డీయే విజయం ఖాయమైపోయిందన్న మోడీ.. నాలుగో విడతలో కాంగ్రెస్ తాము గెలిచే సీట్లను మైక్రోస్కోప్ పెట్టి వెతుక్కోవాలని ఎద్దేవా చేశారు. వికసిత్ భారత్ కావాలని, భారతదేశ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, అశాంతి, విపత్తులు నెలకొన్నాయని, భారత్ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మరోసారి బీజేపీకి ప్రజలు పట్టం కట్టాలని ప్రధాని కోరారు.
హామీలు ఇచ్చి మరచిన కాంగ్రెస్ తెలంగాణకు మేలు చేస్తుందా,,? అని మోడీ ప్రశ్నించారు. ‘సోనియా పుట్టినరోజున రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్.. పంద్రాగస్ట్ కు వాయిదా వేసి, మోసం చేసింది. అమరవీరుల కుటుంబాలకు, మహిళలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందా..? పైగా రాష్ట్రంలో వసూలు చేస్తున్న RR ట్యాక్స్లో తొలి వాటా హైదరాబాద్లోని Rకి వెళితే.. రెండో వాటా ఢిల్లీలోని Rకు వెళ్తాంది’ అని మోడీ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పాపాలను ప్రజలు చూశారు. కాంగ్రెస్ హయాంలో రూ.వేల కోట్ల కుంభకోణాలు వెలుగుచూశాయి. కాంగ్రెస్ హయాంలో బాంబు పేలుళ్లు వంటి ఘటనలు చూశాం. ఇండియా కూటమి ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను తీసుకువస్తామని చెబుతోంది. ప్రతి పార్టీకి ఒక్కో ప్రధాని ఉంటే దేశం బాగుపడుతుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చాక ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని, తెలంగాణ ప్రజల డబ్బులు ఎక్కడికి వెళ్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగానికి ఎలాంటి రక్షణ లేదని అన్నారు. మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని స్పష్టంగా ఉందన్న మోదీ, కర్ణాటకలో బీసీల రిజర్వేషన్లకు కోతపెట్టి ముస్లింలకు ఇచ్చారని మండిపడ్డారు. ఎస్సీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వెనకడుగు వేసిందని, ఎస్సీలకు రిజర్వేషన్ల విషయంలో తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని మోదీ హామీ ఇచ్చారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ మంజూరు చేశామని వెల్లడించారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
Read Also : Ovarian Cancer: మరోసారి వార్తల్లోకి అండాశయ క్యాన్సర్.. దీని లక్షణాలు ఇవే..!
Related News
Warangal Airport : వరంగల్ విమానాశ్రయ నిర్మాణం దిశగా మరో అడుగు
తెలంగాణలోని వరంగల్లో రీజియనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం దిశగా అడుగులు పడతున్నాయి.