HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mulugu Congress Public Meeting Highlights

Mulugu Congress Public Meeting : దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు.. ములుగు కాంగ్రెస్ సభ హైలైట్స్

ములుగు (Mulugu)లో ఏర్పాటు చేసిన విజయభేరి బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు బిఆర్ఎస్, బిజెపి లపై విమర్శల వర్షం కురిపించారు.

  • By Sudheer Published Date - 09:31 AM, Thu - 19 October 23
  • daily-hunt
Mulugu Congress Public Meeting Highlights
Mulugu Congress Public Meeting Highlights

ఈసారి తెలంగాణ లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) పక్క ప్రణాళిక తో ముందుకు వెళ్తుంది. ప్రజలను ఆకట్టుకునే హామీల (Congress Guarantees)నే కాకుండా ఇతర పార్టీల నేతలు సైతం టికెట్ లతో ఆకర్షిస్తూ ముందుకు వెళ్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ దూకుడు చూపిస్తుంది. ఇప్పటికే 55 మందితో కూడిన అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించిన కాంగ్రెస్.. అతి త్వరలోనే మిగతా అభ్యర్థుల ప్రకటన చేయనుంది. ఇదిలా ఉంటె నిన్నటి నుండి ములుగు (Mulugu) జిల్లాలో బస్సు యాత్ర (Congress Bus Yatra) మొదలుపెట్టింది. ఈ సందర్బంగా ములుగు (Mulugu)లో ఏర్పాటు చేసిన విజయభేరి బహిరంగ సభ (Congress Vijaya Bheri Sabha)లో పాల్గొన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) , ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) లు బిఆర్ఎస్ , బిజెపి లపై విమర్శల వర్షం కురిపించారు.

తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అభివృద్ది అనే గ్యారంటీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు చెల్లాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఇస్తానన్న మూడెకరాల భూమి వచ్చిందా? రూ.లక్ష రుణమాఫీ చేస్తానన్నారు, చేశారా? ఉద్యోగాలు ఇస్తానని హామీలు ఇచ్చారు, వచ్చాయా? అవినీతిరహిత పాలన అందిస్తామన్నారు.. అవినీతి చేశారా లేదా? డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు.. ఎంతమందికి ఇచ్చారు? అని రాహుల్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షకోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణలో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీ. బీజేపీ.. బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటోంది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే. పార్లమెంటులో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలుకుతోంది. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. విపక్ష నేతలందరిపైనా కేసులు పెట్టినా.. కేసీఆర్‌పై ఒక్కకేసు పెట్టలేదు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్లే. దేశంలో బీజేపీపై మేము యుద్ధం చేస్తున్నాం.. అందుకే కాంగ్రెస్‌కు మద్దతు తెలపండి అని రాహుల్ అన్నారు. కర్ణాటకలో మహిళలకు వారి అకౌంట్‌లో ఉచితంగా డబ్బు పడుతోందని, తెలంగాణలో కూడా అలాగే ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటుందని, కావాలంటే కర్ణాటక వెళ్లి చూడాలని సూచించారు. అలాగే సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తాం అని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మీ ఆశలు నెరవేరకుండా చేసిందని, మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందని, రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారని తెలిపారు. రాజకీయంగా నష్టమని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని, ప్రత్యేక తెలంగాణ కావాలనే స్వప్నాన్ని మీరు నెరవేర్చుకున్నారని ప్రియాంకగాంధీ తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు రేవంత్. రాబోయే ఎన్నికల్లో కాంగ్రె్‌సను గెలిపించి సోనియమ్మకు బహుమతిగా ఇవ్వాలన్నారు. అంతకు ముందు రాహుల్ , ప్రియాంక లు రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. దాదాపు 35 నిమిషాల పాటు ఆలయంలో గడిపారు. అర్చకులు వారి చేత రుద్రేశ్వరునికి అభిషేకం, పూజలు చేయించారు. అనంతరం గైడ్‌ ద్వారా ఆలయ విశిష్టతలను వారు తెలుసుకున్నారు.

Read Also : Ramgiri Fort : సీతారాములు న‌డ‌యాడిన కొండ… ఈ రామ‌గిరి ఖిల్లా…


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Mulugu Congress Public Meeting
  • Priyanka gandhi
  • rahul
  • revanth reddy

Related News

Supreme Court Dismissed The

Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

Vote For Note Case : ఈ కేసులో నిందితులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 14కి వాయిదా వేసింది

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd