Harish Rao: ప్రధాని మోడీపై మంత్రి హరీష్ రావు ఫైర్
జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధాన మేదైనా ప్రకటిస్తారని ఆశించాం.
- By Hashtag U Published Date - 11:28 PM, Sun - 3 July 22
మోడీని నిలదీస్తూ మంత్రి హరీశ్ రావు వరుస ట్వీట్స్..
#ModiMustAnswer పేరుతో నిలదీత…
జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధాన మేదైనా ప్రకటిస్తారని ఆశించాం. కల్లబొల్లి కబుర్లు, జుమ్లా లు తప్ప విధానమే లేదని తేల్చేశారు. కేసీఆర్ గారు అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేదు సరికదా అసలు తమకు జవాబుదారీ తనమే లేదని నిరూపించారు.
తెలంగాణకు మోదీ మొండి చెయ్యి ఇచ్చారు. గుజరాత్కు వరాలు ఇస్తారు.. క్రూడాయిల్ రాయల్టీ 763 కోట్లు విడుదల చేశారు.. రాజ్కోట్కు ఎయిమ్స్ ఇస్తారు.. బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు..ఆయూర్వేదిక్ యూనివర్సిటీకి జాతీయ హోదా ఇస్తారు.. ట్రెడిషనల్ మెడిసిన్కు సంబంధించి గ్లోబల్ సెంటర్ మంజూరు చేశారు.. నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు.. ఇంకా ఎన్నో ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్కు మిషన్ యూపీకి 55,563 కోట్లు ఇచ్చారు. 9 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ఇచ్చారు..కర్నాటకకు తూముకూర్ ఇండస్ట్రీయల్ స్మర్ట్ సిటీ, ముంబాయి-బెంగళూరు ఎకనామిక్ కారిడార్, మైసూర్ టెక్స్టైల్ మెగా క్లస్టర్.. ఇట్లా ఎన్నో ఇచ్చారు. మరి తెలంగాణకు కూడా ఇట్లానే ఏమైనా ఇస్తారేమో అనుకున్నాం. కానీ, మొండి చెయ్యి ఇచ్చారు. ఒక్కటి కూడా ప్రజలకు పనికివచ్చే ప్రకటన చేయలేదు
1. రాష్ట్రం నుంచి లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని చెప్తున్నారు మోడీగారు.. మరి గడిచిన నెల రోజులుగా 90 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని కేంద్రం తీసుకోవడంలేదు. సీఎంఆర్ తీసుకునేందుకు నిరాకరిస్తున్నది. దీనివిలువ 22వేల కోట్లు ఉంటుంది. ఇదేనా మీ రైతు అనుకూలత మోడీ గారు..? మా రైతుల ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ తీసుకుంటామని సభా వేదిక నుంచి ప్రకటిస్తారని ఆశించాం.. కనీసం ఊసెత్తలేదు
2. మోడీగారు.. మీ ప్రసంగంలో మహిళను మీరేదో ఉద్దరిస్తున్నట్టు చెప్పారు. మరి పార్లమెంటులో పెండింగ్లో ఉన్న మహిళా రిజరే్వషన్ బిల్లును ఎనిమిదేళ్లు అయినా ఎందుకు ఆమోదించలేదు..? సమాధానం ఎందుకు చెప్పలేదు..? తెలంగాణాలో స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్ ఇచ్చి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిబద్దత చాటుకున్నారు.
3. గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చామని మీ కేంద్ర మంత్రులు విజయ సంకల్ప సభ వేదికగా చెప్పారు.. బాగానే ఉంది. మా రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపించింది. దాన్ని ఇప్పటి వరకు మీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆమోదించలేదు. దీనిపై కూడా మీరు వేదికపై సమాధానం చెప్తారని మా గిరిజన సోదరులు భావించారు. అంతే కాదు.. మా గిరిజన యూనివర్సిటీకి ఇప్పటికీ నిధులు ఇవ్వలేదు. అనుమతులు ఇవ్వలేదు.
మా సమ్మక్కసారక్క ఉత్సవానికి నేషనల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు..? తెలంగాణ గిరిజనులు మీకు కనిపించడంలేదా..?
#ModiMustAnswer https://t.co/LV3G20OLzB pic.twitter.com/6JZiAte9QO
— Harish Rao Thanneeru (@trsharish) July 3, 2022
Related News
Harish Rao: ప్రభుత్వ హాస్టళ్ల ఫుడ్ పాయిజన్ ఘటనలపై హరీశ్ రావు రియాక్షన్.. కాంగ్రెస్పై ఫైర్
Harish Rao: తెలంగాణ ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంఘటనలపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. మొన్న భువనగిరి గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం తిని చనిపోయిన ప్రశాంత్ ఉదంతాన్ని మరవక ముందే మరో ఫుడ్ పాయిజన్ ఉదంతం వెలుగులోకి వచ్చిందని హరీశ్ రావు అన్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీవీబీ పాఠశాలలో శుక్రవారం 11 మంది వి�