Malla Reddy : కేసీఆర్ కు వ్యతిరేకంగా వ్యవహరించిన మల్లారెడ్డి
మల్కాజ్ గిరిలో మొతం ఏడు సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. అలాంటి చోట బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని మల్లారెడ్డి బహిరంగంగా ప్రకటించడం ఇప్పుడు అంత చర్చగా మారింది
- By Sudheer Published Date - 05:55 PM, Fri - 26 April 24
ప్రస్తుతం తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Poll) వార్ ..సమ్మర్ ను మించి తలపిస్తుంది. నువ్వా..నేనా అన్నట్లు అధికార – ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు , ఆరోపణలు చేసుకుంటూ మరింత వేడి పుట్టిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..ఈసారి లోక్ సభ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో కేంద్రంలోని బిజెపి ఫై , ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఫై కేసీఆర్ నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ఈ తరుణంలో మాజీ మంత్రి , మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి..అధిష్టాన నిబంధనను బ్రేక్ చేసాడు.
We’re now on WhatsApp. Click to Join.
మల్లారెడ్డి (Malla Reddy) అంటే తెలియని వ్యక్తి కాదు..నిత్యం ఏదొక వార్త తో మీడియా లో నిలువడం ఈయన ప్రత్యేకత. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల హడావిడి నడుస్తుండగా..తాజాగా ఈయన..మల్కాజ్ గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుస్తారంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ పక్క బిజెపి ని వ్యతిరేకిస్తూ..బిఆర్ఎస్ అభ్యర్ధికి ఓటు వేసి గెలిపించాలని కేసీఆర్ కోరుతుంటే..అదే పార్టీ లో ఉంటూ..ఆ పార్టీ కి కాకుండా బిజెపి గెలుస్తుందని మల్లారెడ్డి అనడం ఫై సొంత పార్టీ శ్రేణులు సైతం మండిపడుతున్నారు.
మల్కాజిగిరి నియోజకవర్గం (Malkajigiri Constituency)లో జరిగిన ఒక ఫంక్షన్ కు మల్లారెడ్డి తో పాటు బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ (Etela Rajendar) హాజరయ్యారు. ఈ సందర్బంగా ఒకరికారు కలుసుకొని , ఆప్యాయంగా ఒకరితో మరొకరు ఫోటో దిగారు. ఈ క్రమంలో మల్కాజ్ గిరిలో ఈసారి నువ్వే గెలుస్తున్నవ్ అన్నా.. అంటూ మల్లారెడ్డి మాట్లాడుతూ హత్తుకున్నాడు. ఈ వ్యాఖ్యలు విని ఈటెల తో పాటు ఆయన వర్గీయులు సంతోషం వ్యక్తం చేస్తే..మల్లారెడ్డి పక్కనున్న బిఆర్ఎస్ శ్రేణులు షాక్ కు గురి అయ్యారు. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలోనే మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మల్కాజ్ గిరిలో మొతం ఏడు సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. అలాంటి చోట బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని మల్లారెడ్డి బహిరంగంగా ప్రకటించడం ఇప్పుడు అంత చర్చగా మారింది. దీనిపై మల్లారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో..కేసీఆర్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.
BRS MLA MallaReddy says BJP candidate Eatala Rajender will win as Malkajgiri MP pic.twitter.com/aNrfy4ETWU
— Naveena (@TheNaveena) April 26, 2024
Read Also : Yuvraj Singh: టీ20 వరల్డ్కప్ బ్రాండ్ అంబాసిడర్గా యువరాజ్ సింగ్
Related News
KCR: ప్రజలను కలుస్తూ, కష్టాలను తెలుసుకుంటూ.. పదమూడో రోజు కేసీఆర్ బస్సు యాత్ర విశేషాలు
KCR: ఆదివారం జగిత్యాలలో బస చేసిన కేసీఆర్, బస్సు యాత్ర ద్వారా సోమవారం నిజామాబాద్ దిశగా సాగారు. పదుల సంఖ్యలో వాహనాలు, వందలాదిగా నాయకులు కార్యకర్తలతో కూడిన కేసీఆర్ బస్సు యాత్ర కాన్వాయ్.. తోవలో ప్రజలను కలుస్తూ వారి కష్టాలను దుఃఖాలను సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతోంది. జగిత్యాల లో బస చేసిన కేసీఆర్, స్థానింకంగా నివాసం ఉంటున్న తన చిన్న నాటి గురువు ప్రముఖ క